2020 సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటు చిత్ర పరిశ్రమపై కరోనా మహమ్మారి పడగ విప్పుతూంటే… అటు ప్రముఖ నటులు పరిశ్రమకు శాశ్వతంగా దూరం అవుతున్నారు. తాజాగా మరో నటున్ని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామానికి చెందిన సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పలు సినిమాల్లో నటించారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. రూపాయి…
ఏడేళ్ళ క్రితమే ఇంజనీరింగ్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి నటనను కెరీర్ గా ఎంచుకుంది శ్వేత వర్మ. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి, 2016లో ‘లవ్ చేయాలా వద్దా’ మూవీలో కీలక పాత్రను పోషించింది. ఆ తర్వాత ‘మిఠాయి, సంజీవని, రాణి’ వంటి చిత్రాలలో నటించింది. ‘బియాండ్ బ్రేకప్’ వంటి వెబ్ సీరిస్ లోనూ నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్వేత వర్మకు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓ డబుల్ ధమాకా దక్కబోతోంది. శ్వేత వర్మ…
‘కె.జి.ఎఫ్.’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో యశ్. అతను నటించిన కన్నడ చిత్రం ‘లక్కీ’ తెలుగులో ‘లక్కీ స్టార్’గా డబ్ అవుతోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధికా కుమారస్వామి నిర్మించారు. ఆమె సమర్పణలో శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగు వారి ముందుకు తీసుకొస్తున్నారు. డా. సూరి దర్శకత్వం వహించిన ‘లక్కీస్టార్’లో యశ్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్,…
తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. అయితే ఆ తర్వాత కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే పాన్ ఇండియా మూవీ ‘సాహో’ను చేశాడీ యంగ్ డైరెక్టర్. ఊహించని విధంగా ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. అయినా… ఉత్తరాదిన మాత్రం సుజిత్ కు మేకర్ గా మంచి పేరే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలను సుజిత్ కు…
సీనియర్ కో-డైరెక్టర్, నటుడు ఇరుగు గిరిధర్ (64) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం, ఇరంగారిపల్లిలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. చిత్తూరు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 1982లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎ. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఇవీవీ సత్యనారాయణ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించిన ‘శుభముహూర్తం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. అయితే ఆ చిత్రం కమర్షియల్…
జూనియర్ ఎన్టిఆర్ హాట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ప్రోమో నిన్న విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ షోకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన, ఆసక్తికరమైన అప్డేట్స్ మీకోసం. ఈ కార్యక్రమానికి “సోగ్గాడే చిన్ని నాయన” ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అతను మొదటి సీజన్ మొత్తానికి దర్శకత్వం వహిస్తాడు. కొన్ని ఎపిసోడ్లు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ రెండు ప్రత్యేక ప్రోమోలను కూడా సిద్ధం చేస్తున్నారు.…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియాలో మనం వివిధ రకాల చాలెంజ్ లు చూస్తూ ఉన్నామని గ్రీన్ ఇండియా…
సినిమాల్లోనూ,రాజకీయాల్లోనూ శాశ్వత మిత్రులుకానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని ప్రతీతి. పైగా నటనను పులుముకొని సాగే సినిమా రంగంలో అసలైన స్నేహానికి తావేలేదనీ చెబుతుంటారు. అయితే, అలాంటి అభిప్రాయాలు తప్పు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. నాగిరెడ్డి-చక్రపాణిఅలాంటి వారిలో అందరికంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి. ఒక తల్లి పిల్లల్లాగా చక్రపాణి, నాగిరెడ్డి మసలుకున్నారు. తెలుగు చిత్రసీమలో విలువలతో కూడిన చిత్రనిర్మాణం సాగించారు ఈ ఇద్దరు మిత్రులు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు, తరువాత…
నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ) రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన వివిధ అంశాల్ని, సామాగ్రిని, విశేషాల్ని భద్రపరుస్తూ ఉంటుంది. వీలైనన్ని సినిమాల ప్రింట్స్ తమ వద్ద ఉండేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. భవిష్యత్తులో సినిమాకు సంబంధించి, సినిమా చరిత్రకు సంబంధించి ఏదైనా అధ్యయనం, పరిశోధన చేస్తే అందుకు ఉపయోగపడేలా రకరకాల మూవీ స్పెషల్స్ ని ఎన్ఎఫ్ఏఐ నిరంతరంగా అన్వేషించి భద్రపరుస్తుంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నెగటివ్ ప్రింట్లను…
సాధారణంగా కమర్షియల్ సినిమాలన్నీ ప్రేమతో మొదలై పెళ్లితో ‘ద ఎండ్’ అవుతాయి. కానీ, సుమంత్, నైనా గంగూలీ నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా విషయంలో… శుభం కార్డు నుంచీ కథ మొదలయ్యేలా కనిపిస్తుంది! ‘లైఫ్ ఆఫ్టర్ డైవోర్స్’ అంటున్నాడు అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్… నిజానికి ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు సంబంధించి ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో అనూహ్యంగా లీకైంది. దాంతో అందరూ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని భావించారు. రామ్ గోపాల్ వర్మ అయితే రెండో…