నేడు పాకిస్తాన్ ప్రధాని ఎన్నిక జరగనుంది. పాక్ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ నామినేషన్ వేయగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఒమర్ నామినేషన్ వేశారు. ప్రధాని ఎన్నికపై జాతీయ అసెంబ్లీ ఓటింగ్ నేడు జరగనుంది. నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో కూడా పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఫౌండర్ తుమ్మలపల్లి…
నేటి నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష జరగనుంది. ఇంటర్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించమని తెలిపారు. నేడు తిరుపతి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభ జరగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు సభ ఆరంభం అవుతుంది. ఈ సభకు వైఎస్ షర్మిల, సచిన్ ఫైలెట్, సీపీఐ నారాయణ, సీపీఎం నేతలు హాజరుకానున్నారు. నేడు…
నేడు రుషికొండ భవనాల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, మంత్రి రోజా పాల్గొననున్నారు. దాదాపు రూ.450 కోట్లు పెట్టి సీఎం క్యాంపు కార్యాలయం రుషికొండపై నిర్మించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం విడుదలకానున్నది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ను జారీ చేయనున్నది. పాత నోటిఫికేషన్ను రద్దుచేసి, కొత్త పోస్టులను కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గత ప్రభుత్వం జారీ…