Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 63, 897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.66 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.