కొత్త జీవో కోసం టాలీవుడ్ చేసిన పోరాటం ఫలించింది… కొత్త జీవో వచ్చేసింది అని అంతా సంతోషించే సమయంలోనే చిక్కులు మొదలయ్యాయి. ముఖ్యంగా కొత్త జీవో ప్రకారం శుక్రవారం విడుదల కానున్న “రాధేశ్యామ్”కు తిప్పలు తప్పట్లేదు. ఇక భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కొత్త జీవో 13తో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ కొత్త జీవో కారణంగా 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేదు. అలాగైతే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.
Read Also : Maaran : ధనుష్ సినిమాకు అంతరాయం… స్ట్రీమింగ్ టైం చేంజ్
మరోవైపు రేపు విడుదల కానున్న “రాధేశ్యామ్” సినిమాకు ఇంకా టికెట్స్ విడుదల కానీ వైనం ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జీవో 13 ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసుకున్న హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజుల పాటు ధరలు పెంచుకునే అవకాశం. ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా వున్న పెద్దసినిమాలకు కొత్త జీవో వర్తించదు. పది రోజుల పాటు ధరలు పెంచే అవకాశం ఇవ్వాలి అంటూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ చుట్టూ ప్రొడ్యూసర్స్ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ధరల కన్ఫ్యూషన్ లో ‘రాధేశ్యామ్’ టికెట్స్ కౌంటర్స్ ఇంకా ఓపెన్ కాని పరిస్థితి నెలకొంది.