Home
Telugu News
Telugu News News
-
Bihar Crisis: నితీష్కు కూటమి నేతల ఫోన్లు.. అటువైపు నుంచి ఆన్సర్ ఇదే..!
బీహార్ పరిణామాలతో ఇండియా కూటమిలో గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతుందో అర్థం కాక నేతలు సతమతమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు సింగిల్గానే లోక్సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా ఇండియా కూటమికి రాంరాం చెప్పబోతున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఈ అనిశ్చితితో కూటమి నేతలు కన్ఫ్యూజ్తో తలలు పట్టుకుంటున్నారు. క్షణక్షణం రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. లేటెస్ట్గా నితీష్ ఇస్తు్న్న ట్విస్టుతో నేతలంతా అయోమయానికి గురయ్యారు. -
KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా నుండి తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే కేటీఆర్.. ఆటో ఎక్కడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీశారు. కేటీఆర్ తో పాటు.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు. -
BJP: పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులను నియమించిన బీజేపీ..
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జ్ సహా ఇంఛార్జిలను నియమించింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్ను కేరళ ఇంఛార్జ్గా నియమించింది. అండమాన్ నికోబార్కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్కు అశోక్ సింఘాల్, చండీగఢ్కు విజయభాయ్ రూపానీ, గోవాకు ఆషిశ్ సూద్, డయ్యూ డామన్కు పూర్ణేశ్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్కు శ్రీకాంత్ శర్మలను నియమించింది బీజేపీ హైకమాండ్. -
HMDA: తవ్వేకొద్దీ బయటపడుతున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తులు..
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. హైటెక్ హంగులతో తన ఇంటిని డెకరేట్ చేశారు బాలకృష్ణ. అంతేకాకుండా.. అత్యంత ఖరీదైన 200 పైగా పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బ్రాండెడ్ కు చెందిన 120 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాచ్ లను ఏసీబీ సీజ్ చేసింది. ట్యాగ్… -
Bihar Politics: బీహార్ సంక్షోభంపై కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ కీలక వ్యాఖ్యలు
బీహార్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తాజా పరిణామాలు, జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కూడా చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
BJP Telangana: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కారణమదే..!
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టూర్ క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఆదివారం రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు.. ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న పల్లా
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయింది.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2 గా భార్య నీలిమా, ఏ3 మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 796లో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పదేళ్లుగా 200 మందిని పల్లా రాజేశ్వర్ రెడ్డి నానా… -
At Home Program: రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్, పలువురు నేతలు
రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కాగా.. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరుకాగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం హాజరు కాలేదు. -
Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. -
Car Accident: మంటల్లో కాలి బూడిదైన కారు.. సికింద్రాబాద్లో ఘటన
సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఓ కారు అగ్నికి ఆహుతైపోయింది. ఫ్లై ఓవర్ వద్ద కారు ఇంజన్ భాగం నుంచి పొగలు వస్తుండడం గమనించిన గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్.. వాహనం పక్కకు నిలపాలని కారు యజమానికి సూచించాడు. కారు పక్కకు ఆపి కిందకు దిగేలోపే ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగగా.. వెంటనే కారులో మొత్తం మంటలు వ్యాపించాయి. అప్పటికే యజమాని పక్కకు తప్పుకోగా.. నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనపై…
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!