Bihar Crisis: ఆర్జేడీ కీలక నిర్ణయం.. గవర్నర్ను కలవనున్న ఎమ్మెల్యేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో నితీష్కుమార్కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ను కలిసి లేఖ సమర్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
CM Revanth: ఆ లబ్ధిదారులకు తులం బంగారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి..
ఇదిలా ఉంటే ప్రభుత్వంలో ఇంత అనిశ్చితి ఏర్పడినా.. ఇప్పటి వరకూ నితీష్కుమార్ ఎక్కడా అధికార ప్రకటన చేయలేదు. బీజేపీతో కలిసి వెళ్లాలని నితీష్ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ జేడీయూ నుంచి కానీ.. ఆర్జేడీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రెండు పార్టీల మధ్య అయోమయం.. గందరగోళం నెలకొంది. దీనికంతటికి ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో జరిగిన ఎట్హోం కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలిసి నితీష్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ పరిణామాలే బలం చేకూర్చాయి. పైగా ఈ ప్రోగ్రామ్కి ఆర్జేడీ నేతలెవ్వరూ హాజరుకాలేదు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మితిమీరిన జోక్యం ఎక్కువైపోయిందని.. అందుకే ఆర్జేడీని నితీష్ నమ్మలేకపోతున్నారని జేడీయూ కీలక నేత ఒకరు చెప్పుకొచ్చారు. పైగా ఇండియా కూటమి అధ్యక్షుడిగా నితీష్ను నియమించకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మల్లిఖార్జున ఖర్గేకే ఆర్జేడీ మద్దతు తెలిపింది. ఈ పరిణామం నితీష్కు రుచించలేదని తెలుస్తోంది. ఈ సంఘటనలే రాజకీయ సంక్షోభానికి కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!