Bihar Crisis: ఆర్జేడీ కీలక నిర్ణయం.. గవర్నర్ను కలవనున్న ఎమ్మెల్యేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో నితీష్కుమార్కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ను కలిసి లేఖ సమర్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
CM Revanth: ఆ లబ్ధిదారులకు తులం బంగారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి..
ఇదిలా ఉంటే ప్రభుత్వంలో ఇంత అనిశ్చితి ఏర్పడినా.. ఇప్పటి వరకూ నితీష్కుమార్ ఎక్కడా అధికార ప్రకటన చేయలేదు. బీజేపీతో కలిసి వెళ్లాలని నితీష్ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ జేడీయూ నుంచి కానీ.. ఆర్జేడీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రెండు పార్టీల మధ్య అయోమయం.. గందరగోళం నెలకొంది. దీనికంతటికి ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో జరిగిన ఎట్హోం కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలిసి నితీష్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ పరిణామాలే బలం చేకూర్చాయి. పైగా ఈ ప్రోగ్రామ్కి ఆర్జేడీ నేతలెవ్వరూ హాజరుకాలేదు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మితిమీరిన జోక్యం ఎక్కువైపోయిందని.. అందుకే ఆర్జేడీని నితీష్ నమ్మలేకపోతున్నారని జేడీయూ కీలక నేత ఒకరు చెప్పుకొచ్చారు. పైగా ఇండియా కూటమి అధ్యక్షుడిగా నితీష్ను నియమించకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మల్లిఖార్జున ఖర్గేకే ఆర్జేడీ మద్దతు తెలిపింది. ఈ పరిణామం నితీష్కు రుచించలేదని తెలుస్తోంది. ఈ సంఘటనలే రాజకీయ సంక్షోభానికి కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!