వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ వరంగల్ నియోజకర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రైతు బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు.
వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొత్త కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాలు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.. అయితే, పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్ద పీటలపై కూర్చోగా... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఈ అంశంపై…
బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలు పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ.. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు సమావేశాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి, సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అధ్యాపకుల, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. 2021 నుండి రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఖాళీగా ఉన్న 4356 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే స్పందించి పోస్టుల భక్తీకి గ్రీన్…
కరీంనగర్ జిల్లా కదనభేరి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా తాము అభివృద్ధిపై పోరాడుతామని తెలిపారు. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి…
ఎందరో జీవితాలకు వెలుగునిచ్చి ఎమ్మిగనూరు ప్రాంత ప్రజల గుండెల్లో... చిరస్మరణీయుడుగా నిలిచిన మహనీయుడు, చేనేతల పితామహుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప. ఆయన ఆశయాలు నిరంతరం కొనసాగాలంటే.. అది కేవలం ఎం.జి. కుటుంబ వారసుడు డాక్టర్ మాచాని సోమనాథ్ తోనే సాధ్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప బంగ్లాలో ఏర్పాటైన సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. పరిశ్రమలను స్థాపించి, చేనేతల పితామహుడుగా పేరుగాంచి 1954 లో భారత రాష్ట్రపతి చేత పద్మశ్రీ…
తెలంగాణ కేబినెట్ పలు కార్పొరేషన్లకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పామని.. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ, మున్నూరు కాపు, పెరిక, గంగపుత్ర, పద్మశాలి కార్పొరేషన్.. ఏబీసీలకు కార్పొరేషన్ వైశ్య, రెడ్డి కార్పొరేషన్, మాల, మాదిగ కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.