బీహార్లోని బగాహా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు ప్రమాదానికి గురైంది. బగాహ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. రాజస్థాన్లోని ఆర్మీ బెటాలియన్ను బెంగాల్కు వెళ్తున్నట్లు సమాచారం. రైలులో సైనిక సిబ్బందితో పాటు వారి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రైలులోని మూడు బోగీలు బగాహా వద్ద రైల్వే ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. దీంతో.. గోరఖ్పూర్-నర్కటియాగంజ్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.
ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్.. ఆ కూటమికి ఓటేస్తే 4శాతం రిజర్వేషన్ పోయినట్లే టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీకి ఓటు వేస్తే ముస్లింల 4 శాతం పర్సెంట్ రిజర్వేషన్ పోయినట్లే అని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో గందరగోళం చేశారు.. ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకొని నీచంగా మాట్లాడుకున్నారు అని ఆయన…
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేపట్టి తాగునీటి సరఫరాను నిర్విరామంగా కొనసాగించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ సరిపడా నీటిని అందిస్తున్నామని, ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరితే వాటిని…
Man stabs wife: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. మధ్యాహ్నం భోజనం ఆలస్యమైందని ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా పొడిచి చంపాడు. 30 ఏళ్ల పరస్రామ్,28 ఏళ్ల తన భార్య ప్రేమాదేవీని చంపేశాడు. రాష్ట్రంలోని సీతాపూర్లో థాంగావ్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కొత్వలన్పూర్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం.. ఎందుకంటే కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతాయి. అందుకోసమని మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్ వినియోగం వల్ల శరీరం ఫిట్గా ఉంటుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే.. వైద్యనిపుణులు బరువు తగ్గించే ప్రొటీన్ను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతుంటారు. అందుకోసమని వైద్యులు ఎక్కువగా.. కోడిగుడ్లు లేదా మాంసం తినండని సూచిస్తారు. అయితే.. ఇవే కాకుండా ప్రోటీన్స్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందాం....
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు అనుమానిత మావోయిస్టులు, వారిలో ఇద్దరు నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు మరణించారని పోలీసులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాకు 400 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ సరిహద్దులో ఉన్న కొలమార్క పర్వతాలలో దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. మృతి చెందిన మావోయిస్టులపై రూ. 36 లక్షల సామూహిక రివార్డు ఉందని గడ్చిరోలి, నీలోత్పాల్ పోలీసు సూపరింటెండెంట్ (SP) తెలిపారు. గడ్చిరోలిలో అనుమానిత…
ముఖం అందం కోసం ఎన్నో రకాలైన క్రీములు, పౌడర్లు వాడుతుంటారు. అవి కొందరి చర్మానికి ఉపయోగపడితే.. మరికొందరికీ అవి పడక మొత్తం స్కిన్ పాడవుతుంది. అలాంటప్పుడు.. ముఖ అందాన్ని సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని వంటింట్లో దొరికే వస్తువులతో అందంగా తయారుచేసుకోవచ్చు. బియ్యపు పిండి గురించి అందరు వినే ఉంటారు. చర్మ సంరక్షణలో బియ్యం పిండిని అనేక రకాలుగా వాడవచ్చు. ఇందులో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫెరులిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం పిండి వృద్ధాప్య…
ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) చే నిర్వహించబడిన ప్రపంచవ్యాప్త ఉద్యమం . భూమి కోసం ఒక గంట సమయం ఇవ్వాలని వ్యక్తులు, సంఘాలు మరియు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ వార్షికంగా ఈ ఈవెంట్ నిర్వహించబడుతుంది మరియు అదనంగా ల్యాండ్మార్క్లు మరియు వ్యాపారాలు అనవసరమైన విద్యుత్ దీపాలను ఆపివేయడం ద్వారా సాధారణంగా రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు ఒక గంట పాటు నిర్వహించబడుతుంది. ఎర్త్ అవర్ లో భాగంగా దేశ వ్యాప్తంగా…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకుని ప్రతి ఓటర్ను గుర్తించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జలదంకి మండలం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. జలదంకి మండల కన్వీనర్ కె. మధుమోహన్ రెడ్డి అధ్యక్షతన…
ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్లు మార్కెట్లలో నిగనిగ మెరుస్తూ ఉంటాయి. మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే.. మామిడిపండ్లు తియ్యగా ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే మామిడిని 'పండ్లలో రారాజు' అని అంటారు. అయితే.. ఉగాది తర్వాత మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇక సీజన్ ప్రారంభంలో ఎక్కువగా పచ్చిమామిడి కాయలు లభిస్తాయి. వాటితో చాలా మంది పచ్చడి తయారు చేసుకుంటారు. మరి కొంతమంది పచ్చికాయలను కోసి ఆ ముక్కలపై…