Skin Care: దీనిని ముఖానికి రాసుకుంటే.. డెడ్ స్కిన్ తొలగిపోయి అందంగా కనిపిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖం అందం కోసం ఎన్నో రకాలైన క్రీములు, పౌడర్లు వాడుతుంటారు. అవి కొందరి చర్మానికి ఉపయోగపడితే.. మరికొందరికీ అవి పడక మొత్తం స్కిన్ పాడవుతుంది. అలాంటప్పుడు.. ముఖ అందాన్ని సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని వంటింట్లో దొరికే వస్తువులతో అందంగా తయారుచేసుకోవచ్చు. బియ్యపు పిండి గురించి అందరు వినే ఉంటారు. చర్మ సంరక్షణలో బియ్యం పిండిని అనేక రకాలుగా వాడవచ్చు. ఇందులో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫెరులిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం పిండి వృద్ధాప్య శాస్త్రాన్ని నెమ్మదిస్తుంది.. అంతేకాకుండా.. చర్మం నుండి వచ్చే నూనెను తగ్గిస్తుంది. చర్మానికి మెత్తగా కాపాడే ప్రభావాలను ఇస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. బియ్యపు పిండింతో.. కఠినమైన చర్మాన్ని మృదువుగా చేస్తుంది.. సూర్య కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. బియ్యప్పిండిని ముఖానికి ఏయే రకాలుగా రాసుకోవచ్చో తెలుసుకుందాం.
బియ్యం పిండి-పాలు
ముఖం ఎక్స్ఫోలియేట్ చేయడానికి.. బియ్యం పిండి, పాలు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని అందులో పాలు అవసరాన్ని బట్టి పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఆ తర్వాత ముఖం మెరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా.. ముఖం నుండి మురికి, మృత చర్మ కణాలను తొలగిస్తుంది.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
బియ్యం పిండి-అలోవెరా
అలోవెరా జెల్, బియ్యప్పిండిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం ఉపరితలంపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి.. ఒక గిన్నెలో 2 చెంచాల కలబందను తీసుకొని, అందులో ఒక చెంచా బియ్యప్పిండిని కలపండి. ఈ ఫేస్ ప్యాక్ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత చర్మం అందంగా మెరుస్తుంది.
బియ్యం పిండి- గోధుమ పిండి
మచ్చలు, నల్లటి వలయాల సమస్య తగ్గాలంటే ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయండి. ఒక చెంచా బియ్యం పిండిలో ఒక చెంచా గోధుమ పిండి కలపాలి. ఈ ఫేస్ ప్యాక్లో టొమాటో రసం, గ్రైండ్ చేసిన బంగాళదుంప తొక్కలను కలపాలి. ఇలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ని వారానికి రెండు సార్లు వేసుకోవచ్చు.
బియ్యం పిండి- తేనె
వడదెబ్బ సమస్యను తగ్గించడానికి మరియు చర్మాన్ని తేలికగా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేయవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ యొక్క ఉపశమన ప్రభావాలు ముఖంపై సూర్యరశ్మిని తగ్గిస్తాయి. 2 చెంచాల బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక చెంచా తేనె, 2 చెంచాల రోజ్ వాటర్ కలపాలి. మూడింటినీ కలిపి పేస్ట్ను తయారు చేసుకోవాలి. బియ్యప్పిండి ఫేస్ ప్యాక్ తయారయ్యాక.. అరగంట పాటు ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టించిన తర్వాత ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!