Skin Care: దీనిని ముఖానికి రాసుకుంటే.. డెడ్ స్కిన్ తొలగిపోయి అందంగా కనిపిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖం అందం కోసం ఎన్నో రకాలైన క్రీములు, పౌడర్లు వాడుతుంటారు. అవి కొందరి చర్మానికి ఉపయోగపడితే.. మరికొందరికీ అవి పడక మొత్తం స్కిన్ పాడవుతుంది. అలాంటప్పుడు.. ముఖ అందాన్ని సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని వంటింట్లో దొరికే వస్తువులతో అందంగా తయారుచేసుకోవచ్చు. బియ్యపు పిండి గురించి అందరు వినే ఉంటారు. చర్మ సంరక్షణలో బియ్యం పిండిని అనేక రకాలుగా వాడవచ్చు. ఇందులో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫెరులిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం పిండి వృద్ధాప్య శాస్త్రాన్ని నెమ్మదిస్తుంది.. అంతేకాకుండా.. చర్మం నుండి వచ్చే నూనెను తగ్గిస్తుంది. చర్మానికి మెత్తగా కాపాడే ప్రభావాలను ఇస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. బియ్యపు పిండింతో.. కఠినమైన చర్మాన్ని మృదువుగా చేస్తుంది.. సూర్య కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. బియ్యప్పిండిని ముఖానికి ఏయే రకాలుగా రాసుకోవచ్చో తెలుసుకుందాం.
బియ్యం పిండి-పాలు
ముఖం ఎక్స్ఫోలియేట్ చేయడానికి.. బియ్యం పిండి, పాలు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని అందులో పాలు అవసరాన్ని బట్టి పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఆ తర్వాత ముఖం మెరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా.. ముఖం నుండి మురికి, మృత చర్మ కణాలను తొలగిస్తుంది.
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
బియ్యం పిండి-అలోవెరా
అలోవెరా జెల్, బియ్యప్పిండిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం ఉపరితలంపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి.. ఒక గిన్నెలో 2 చెంచాల కలబందను తీసుకొని, అందులో ఒక చెంచా బియ్యప్పిండిని కలపండి. ఈ ఫేస్ ప్యాక్ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత చర్మం అందంగా మెరుస్తుంది.
బియ్యం పిండి- గోధుమ పిండి
మచ్చలు, నల్లటి వలయాల సమస్య తగ్గాలంటే ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయండి. ఒక చెంచా బియ్యం పిండిలో ఒక చెంచా గోధుమ పిండి కలపాలి. ఈ ఫేస్ ప్యాక్లో టొమాటో రసం, గ్రైండ్ చేసిన బంగాళదుంప తొక్కలను కలపాలి. ఇలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ని వారానికి రెండు సార్లు వేసుకోవచ్చు.
బియ్యం పిండి- తేనె
వడదెబ్బ సమస్యను తగ్గించడానికి మరియు చర్మాన్ని తేలికగా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేయవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ యొక్క ఉపశమన ప్రభావాలు ముఖంపై సూర్యరశ్మిని తగ్గిస్తాయి. 2 చెంచాల బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక చెంచా తేనె, 2 చెంచాల రోజ్ వాటర్ కలపాలి. మూడింటినీ కలిపి పేస్ట్ను తయారు చేసుకోవాలి. బియ్యప్పిండి ఫేస్ ప్యాక్ తయారయ్యాక.. అరగంట పాటు ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టించిన తర్వాత ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..