కొమురం భీం జిల్లాలోని నిర్వహించిన సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈనెల 5 వ తేదీన నిర్మల్ కు రాహుల్ గాంధీ వస్తున్నారని, బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారన్నారు. ఆసిఫాబాద్ లో సిఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ అయిందని, అనేక ప్రాజెక్టులు , రోడ్లు ఇతర సమస్యల పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బీజేపి సిద్దాంతమే మనుధర్మంది అని, మేము చెప్పేది ప్రజల్లోకి వెళ్ళిందన్నారు మంత్రి సీతక్క. బీజేపి…
వైసీపీ అగ్రనాయకత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్ కల్యాణ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై, అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పైచంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా 45 డిగ్రీలు, 46 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుపతి దేవస్థానం…
మండుటెండలో సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ బస్సు యాత్రకు అన్యుహ్య స్పందన వస్తుందని 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని నివేదికలు రావటంతో బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ 48 గంటలు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. 5 నెలల్లో రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్ని ఎందుకు వదులుకున్నాం అని నేడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్…
కొమురంభీం జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలపై బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రేమ లేదన్నారు. ఆదివాసీల సమస్యల్ని పట్టించు కోలేదని ఆయన మండిపడ్డారు. సోయం బాపూరావు సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కేంద్ర మంత్రుల చూట్టూ తిరిగినా పట్టించు కోలేదని, ఆఖరికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపు రావు కు టికెట్ ఇవ్వకుండా అవమానించిందని ఆయన విమర్శించారు. ఆత్రం సుగుణకు అవకాశం…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్కి, నాన్లోకల్కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35, 42వ డివిజన్లలో తన తండ్రి కేశినేని నాని తరఫున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాగిడి లక్ష్మారెడ్డితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత పాల్గొన్నారు.
బండి సంజయ్ పై కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ వెలిచాల రాజేందర్ మాట్లాడుతూ.. బండి సంజయ్.. పిచ్చి ప్రేలాపనలు, కట్టుకథలు మానేయండని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు ఎవరో కూడా నాకు తెలియదని, నేనెప్పుడూ ఆయన్ని కలవలేదు… అలాంటప్పుడు ఆయనెలా నాకు టికెట్ ఇప్పిచే ప్రయత్నం చేస్తారన్నారు వెలిచాల రాజేందర్. ఎన్నికల నేపథ్యం లో బండి సంజయ్ చెబుతున్న కట్టు కథలు అని, అశోక్ రావు…