ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కూలిన టర్మినల్ పైకప్పు 2008-09 కాలంలో నిర్మించబడిందని మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం తెలిపారు.
రేపు ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్, కెన్సింగ్టన్ ఓవల్లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైటిల్ పోరుకు ముందే క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. జూన్ 29న బార్బడోస్లో వర్షం పడే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్…
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యధావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కి టెక్స్టైల్ పార్క్కు చేరుకుని, అనంతరం 2:10కి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి…
పాన్ ఇండియా లెవెల్లో హీరో సూర్యకు ఉన్న స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ రాజమౌళి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ఖాతాలో తన స్పందనను తెలియజేశారు.
తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రోటీన్ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) సంక్రమణను నాశనం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకంగా పరిగణించబడుతుంది. ఎయిమ్స్లోని బయోఫిజిక్స్ అండ్ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన వైద్యులు ల్యాబ్లో జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిమ్స్ (AIIMS) ఈ పరిశోధన అంతర్జాతీయ మెడికల్ జర్నల్ (ఫ్యూజర్ మైక్రోబయాలజీ జర్నల్)లో ప్రచురించబడింది. భవిష్యత్తులో తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రొటీన్ నుండి బ్లాక్ ఫంగస్కు ఔషధాన్ని తయారు…
Coolie: లోకేష్ కనగరాజ్ కొత్త చిత్రం 'కూలీ' నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ లుక్ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అది వైరల్గా మారింది. 'కూలీ' షూటింగ్ జూలై నుంచి ప్రారంభమై 2025లో విడుదల కానుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు.
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.…
కేజీఎఫ్ చిత్రంతో కన్నడు హీరో యశ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాఖీ భాయ్ పాత్రతో తన నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రంతో ఇండియన బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ''టాక్సిక్" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యశ్.