జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ , ఎమ్మెల్సీ రమణ, 18 మండలల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ హౌలే గాన్ని ఎమ్మెల్యేను చేసింది ఎవరు..? జగిత్యాలను జిల్లా…
నీట్ కౌన్సిలింగ్కి వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కి పిలుపునిస్తాము ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తెలిపారు. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించాలని, NTA ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి , యువజన ఐక్య కమిటీ అధ్వర్యంలో గవర్నర్ అప్పోయింట్మెంట్ కోరడం జరిగింది. గవర్నర్ అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం తో…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లను సోమవారం తెరిచారు. గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచన చేస్తోంది.
సాధారణంగా తన భర్త తనను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదులు ఎన్నో చూశాం. ప్రియురాలి మోజులో మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా చూశాం. కానీ రెండు సార్లు పెళ్లయిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖలు అచ్చువేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టి భర్తకు మరో వివాహం చేశారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్రమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు తెరచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు ఎత్తనున్నారు. బాబ్లీ ప్రాజెక్టును తెలంగాణ -మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కేంద్ర జల సంఘం ప్రతినిధులు సందర్శించనున్నారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు.