Bhatti Vikramarka : నేటితో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఏడాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నాడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క తన పాదయాత్రను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జులై 2న ఖమ్మం నగరంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడర్ లో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తంగా 109 రోజులు పాటు కొనసాగింది. సుమారు 700కు పైగా గ్రామాల మీదుగా భట్టి విక్రమార్క 1364 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర మొత్తంగా 17 జిల్లాల్లో 36 నియోజకర్గాల మీదుగా కొనసాగింది. ఈ పాదయాత్రలో 100కు కార్నర్ మీటింగ్స్, మంచిర్యాల, జడ్చెర్ల, ఖమ్మంలలో భారీ బహిరంగ సభలు జరిగాయి. మంచిర్యాల సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఖమ్మం బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యతిధులుగా హాజరయ్యారు.
Also Read
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
అప్పటి వరకూ ఎవరూ వెళ్లడానికి సాహసించని మరుమూల గ్రామాలు, కొండల్లో, అడవుల్లో నివాసముండే ఆదివాసులు గూడాలు, గిరిజన తాండాల ప్రజలను భట్టి విక్రమార్క ఈ పాదయాత్రలో కలిసి… వారికి బాధలను కష్టాలను తెలుసుకోవడం విశేషం.
ఈ పాదయాత్రలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలను అర్పించిన అమరుల ఆశయాల గురించి అడుగడుగునా ప్రజలతో చర్చించడం.. వారినుంచి వచ్చిన సానుకూల స్పందన.. నిన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగిన మొత్తం 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 26 చోట్ల ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో భట్టి విక్రమార్క పాదయాత్ర ఎంత కీలకంగా మారిందో చెప్పేందుకో ఈ గణాంకాలే పెద్ద నిదర్శనం.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క.. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు గదులు ఇందిరమ్మ ఇల్లు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, పేదలకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండర్, ఆరోగ్య శ్రీ విస్తరణ సహా పలు అంశాలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు చిత్తశుద్దితో నేడు కృషి చేస్తున్నారు.
ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలను సాధించి పెట్టింది.
తాజావార్తలు
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!