Bhatti Vikramarka : నేటితో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఏడాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నాడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క తన పాదయాత్రను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జులై 2న ఖమ్మం నగరంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడర్ లో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తంగా 109 రోజులు పాటు కొనసాగింది. సుమారు 700కు పైగా గ్రామాల మీదుగా భట్టి విక్రమార్క 1364 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర మొత్తంగా 17 జిల్లాల్లో 36 నియోజకర్గాల మీదుగా కొనసాగింది. ఈ పాదయాత్రలో 100కు కార్నర్ మీటింగ్స్, మంచిర్యాల, జడ్చెర్ల, ఖమ్మంలలో భారీ బహిరంగ సభలు జరిగాయి. మంచిర్యాల సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఖమ్మం బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యతిధులుగా హాజరయ్యారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
అప్పటి వరకూ ఎవరూ వెళ్లడానికి సాహసించని మరుమూల గ్రామాలు, కొండల్లో, అడవుల్లో నివాసముండే ఆదివాసులు గూడాలు, గిరిజన తాండాల ప్రజలను భట్టి విక్రమార్క ఈ పాదయాత్రలో కలిసి… వారికి బాధలను కష్టాలను తెలుసుకోవడం విశేషం.
ఈ పాదయాత్రలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలను అర్పించిన అమరుల ఆశయాల గురించి అడుగడుగునా ప్రజలతో చర్చించడం.. వారినుంచి వచ్చిన సానుకూల స్పందన.. నిన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగిన మొత్తం 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 26 చోట్ల ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో భట్టి విక్రమార్క పాదయాత్ర ఎంత కీలకంగా మారిందో చెప్పేందుకో ఈ గణాంకాలే పెద్ద నిదర్శనం.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క.. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు గదులు ఇందిరమ్మ ఇల్లు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, పేదలకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండర్, ఆరోగ్య శ్రీ విస్తరణ సహా పలు అంశాలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు చిత్తశుద్దితో నేడు కృషి చేస్తున్నారు.
ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలను సాధించి పెట్టింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!