Bhatti Vikramarka : నేటితో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఏడాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నాడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క తన పాదయాత్రను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జులై 2న ఖమ్మం నగరంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడర్ లో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తంగా 109 రోజులు పాటు కొనసాగింది. సుమారు 700కు పైగా గ్రామాల మీదుగా భట్టి విక్రమార్క 1364 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర మొత్తంగా 17 జిల్లాల్లో 36 నియోజకర్గాల మీదుగా కొనసాగింది. ఈ పాదయాత్రలో 100కు కార్నర్ మీటింగ్స్, మంచిర్యాల, జడ్చెర్ల, ఖమ్మంలలో భారీ బహిరంగ సభలు జరిగాయి. మంచిర్యాల సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఖమ్మం బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యతిధులుగా హాజరయ్యారు.
Also Read
- BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
అప్పటి వరకూ ఎవరూ వెళ్లడానికి సాహసించని మరుమూల గ్రామాలు, కొండల్లో, అడవుల్లో నివాసముండే ఆదివాసులు గూడాలు, గిరిజన తాండాల ప్రజలను భట్టి విక్రమార్క ఈ పాదయాత్రలో కలిసి… వారికి బాధలను కష్టాలను తెలుసుకోవడం విశేషం.
ఈ పాదయాత్రలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలను అర్పించిన అమరుల ఆశయాల గురించి అడుగడుగునా ప్రజలతో చర్చించడం.. వారినుంచి వచ్చిన సానుకూల స్పందన.. నిన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగిన మొత్తం 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 26 చోట్ల ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో భట్టి విక్రమార్క పాదయాత్ర ఎంత కీలకంగా మారిందో చెప్పేందుకో ఈ గణాంకాలే పెద్ద నిదర్శనం.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క.. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు గదులు ఇందిరమ్మ ఇల్లు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, పేదలకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండర్, ఆరోగ్య శ్రీ విస్తరణ సహా పలు అంశాలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు చిత్తశుద్దితో నేడు కృషి చేస్తున్నారు.
ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలను సాధించి పెట్టింది.
తాజావార్తలు
-
The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
-
BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!