అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జోబైడెన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెంట్గా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన తెలిపారు. అధ్యక్ష పోటీకి కమలాహారిస్ను బైడెన్ ప్రతిపాదించారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూగో జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది.
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు.
TDLP Meeting: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీఎల్పీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో సబ్జెక్టులను ప్రిపేరై రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను సభలో ప్రస్తావించేలా స్టడీ చేసి రావాలని చంద్రబాబు సూచించనున్నారు. బయట చేస్తున్న దుష్ప్రచారాన్నే వైసీపీ సభలో కూడా చేస్తే గట్టి కౌంటర్లివ్వాలని టీడీపీ…
గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట... లేకపోతే కేసులు పెడతారంట ...హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ ఎగువన వున్న వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఎగువ నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇరిగేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. నిన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల.. అదే విధంగా ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలంలో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకున్నప్పటికీ.. మరి కొద్దిసేపట్లో 43 అడుగులకు చేరనుంది.