ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమతో సహా అనేక రంగాలకు లిథియం కీలకమైన భాగం. అంతేకాకుండా.. రాగి, కోబాల్ట్.. అరుదైన భూమి మూలకాలపై కూడా మినహాయింపు ప్రతిపాదించారు. ఇంకా.. ఈ మెటీరియల్లలో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని తగ్గించాలని ఆర్థికమంత్రి సూచించారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటనతో…
లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాదని, బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్ను రూపొందించారని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బీహార్కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఆంధ్రప్రదేశ్కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా…
సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్గా గుర్తించారు పోలీసులు. అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో సమస్యలతో డిప్రెషన్లో ఉరేసుకొని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని హెచ్చరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అత్యవసర పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని అధికారులను కోరారు. రాబోయే మూడు రోజులలో 30-40 కి.మీ/గం గాలులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. జూలై 22, సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో నిర్వహించిన…
రోహన్ బోపన్న తన కెరీర్లో 35 ఏళ్ల తర్వాత భారీ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బోపన్న వయసు 44 ఏళ్లు. అయినప్పటికీ.. అతను విజయాల్లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకుని గ్రాండ్స్లామ్ గెలిచిన ఎక్కువ వయస్సున్న టెన్నిస్ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు బోపన్న కళ్లు పారిస్ ఒలింపిక్స్పై పడ్డాయి. అయితే.. తాను తన రెగ్యులర్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్తో కాకుండా ఎన్. శ్రీరామ్ బాలాజీతో రంగంలోకి దిగబోతున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా పంట రుణమాఫీని అమలు చేయాలని, అలాగే గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . అసెంబ్లీకి బయలుదేరే ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , సీనియర్ నేతలు హరీష్రావు , జగదీష్ రెడ్డి తదితరులతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్పార్క్ వద్ద సమావేశమై తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి…
కేంద్రబడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అంటూ ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్పై స్పందించారు. బడ్జెట్లో ఏపీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టారన్నారు.
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం నుంచి లక్షా 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 1,50,900 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.