నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు. దిలావర్ పూర్-గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని చెప్పారు.
ఇండియాలో క్రికెట్కు ఉన్న అపారమైన ఆదరణ కారణంగా, ప్రపంచంలోని ఇతర క్రికెటర్ల కంటే ఇక్కడి ఆటగాళ్ల బ్రాండ్ విలువ చాలా ఎక్కువ. ఇది కాకుండా.. భారత క్రికెటర్లు ప్రపంచ వేదికపై కూడా గుర్తింపు పొందారు. అయితే బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ క్రికెటర్ల కంటే బాలీవుడ్ స్టార్లు చాలా వెనుకబడి ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని బాలీవుడ్ ప్రముఖులను అధిగమించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర…
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల అధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
చలికాలంలో కండరాలు, ఎముకల్లో నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరం యొక్క కండరాలు, సిరలలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ క్రమంలో.. సిరల్లో నొప్పి, వాపు సమస్యలు ఏర్పడతాయి. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా నరాల నొప్పి వస్తుంది. నేషనల్ హార్ట్, లంగ్స్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. విటమిన్ B12 శరీరానికి అవసరమైన విటమిన్.. ఈ విటమిన్ లోపం వల్ల చేతులు, కాళ్ళ నరాలలో నొప్పిని కలిగిస్తుంది.
జెడ్డాలో ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలం జరిగింది. ఈ వేలంలో బిడ్డింగ్కు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన పేరును ఇవ్వలేదు. అయితే.. అందుకు గల కారణాన్ని స్టోక్స్ చెప్పాడు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్లు రైతుకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ. 3 వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు.
ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ను గుడివాడలో ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ డౌక్ సెంటర్లో బుధవారం (నవంబరు 27)న ఉదయం 09:30 గంటలకు గుడివాడ శాసనసభ్యులు వెదిగండ్ల రాము ప్రారంభించారు.