TTD: తిరుచానూరులో రేపటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి
- రేపటి నుంచి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
- డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఈవో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టామని తెలిపారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామని అన్నారు.
Read Also: Telangana: రేపటి నుంచి రైతు పండుగ.. రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
మరోవైపు.. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు ఏర్పాటు చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. అలాగే.. పంచమి రోజున 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50 వేలకు పైగా భక్తులకు తాగునీరు, బాదంపాలు, బిస్మిల్లా బాత్, పెరుగు అన్నం, విజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చెక్కెర పొంగలి అందిస్తామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. బ్రహ్మోత్సవాలలో టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది.. పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అన్నారు. బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తారన్నారని చెప్పారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 6వ తేదీ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ అని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.
Read Also: Pawan Kalyan Meets PM Modi: ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. మోడీకి డిప్యూటీ సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు
తాజావార్తలు
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?