కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లా దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. రాబోయే రాజస్థాన్ ఎన్నికల కోసం సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్లో జీవిత భాగస్వామి వివరాలను కోరుతున్న కాలమ్లో కాంగ్రెస్ నాయకుడు "విడాకులు తీసుకున్నాను" అని పేర్కొన్నందున ఇది వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని హామీలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, cm kcr, brs, telangana elections 2023
ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.
ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్.. తన జియో ఫోన్ ప్రైమ్ 4Gని విడుదల చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ఆ ఫోన్ను ఆవిష్కరించారు. ఇక.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 2,599 ఉంది.
ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్లాండ్కు వెళ్లవచ్చు. థాయ్లాండ్కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.
ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యా్చ్లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్ చేసిన పాక్.. 45.1 ఓవర్లలో 204 పరుగులకే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసింది.
క్యాష్ ఫర్ క్వెరీ' కేసుకు సంబంధించి నవంబర్ 2న లోక్సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం (అక్టోబర్ 31) తెలిపారు. కాగా, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను మహువా పూర్తిగా తోసిపుచ్చారు.
వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పేలవ ఫాం కొనసాగుతుంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ముఖ్యంగా బౌలర్ల విషయానికొస్తే.. మొదట్లో ఫామ్లో లేని షహీన్ షా అఫ్రిదీ.. రెండు మ్యాచ్ల తర్వాత పుంజుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ఫెయిల్యూరే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ టోర్నీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ వీరవిహారం చేస్తున్నారు.
కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం అనేక ప్రతిపక్ష నాయకులు చేసిన ఆందోళనలను ప్రస్తావించారు. యాపిల్ నుంచి తమకు హెచ్చరిక సందేశాలు వచ్చాయని, వారు తమ ఐఫోన్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న “స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్స్” లక్ష్యంగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.