ఈకమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థగ్ లైఫ్”. హై-ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా “థగ్ లైఫ్” జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేయనుంది. గతంలో ‘విక్రమ్’, ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్లను అందించిన…
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ 5, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్…
సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం భార్య అయిన సుహాసిని, తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు హాజరైంది. ఈ సందర్భంగా సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. Also…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనంగా మారిన వార్త ఏంటంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’ నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకుంది. తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. ఆమె స్థానంలో కన్నడ సినిమా నటి రుక్మిణి వసంత్ను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. Also Read:Sai Srinivas : ఆ హీరోల లాగే రెండు,…
తెలుగు సినిమా ఇండస్ట్రీ (టాలీవుడ్) రేంజ్ రోజురోజుకీ మారిపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మీద దృష్టి పెట్టకుండా, మంచి రెమ్యునరేషన్ ఇస్తే చాలు.. డేట్స్ ఇచ్చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో తమిళ స్టార్స్ టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. Also Read:Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జూన్ నెల నుంచి జోరందుకోనుంది. గతంలో సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ కాంబోలో దర్శకుడు హరీష్ శంకర్తో పవన్ కళ్యాణ్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం, ఇది అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో…
ఒక పాన్ ఇండియా స్టార్ హీరో, మరో పాన్ ఇండియా డైరెక్టర్ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఒక పెద్ద నిర్మాణ సంస్థతో పాటు మరో నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటుంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రంలో షూట్ చేశారు. ఈ షూటింగ్ జరిగినప్పుడు అనుకోని సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. Also Read:Heroines…
‘హరి హర వీరమల్లు’ సినిమా గీతావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఈ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం క్రిష్తో మొదలై, ఇప్పుడు జ్యోతికృష్ణతో సఫలమైంది. నేను ఎందరో దర్శకులతో పనిచేశాను, కానీ జ్యోతికృష్ణలో అరుదైన లక్షణం కనిపించింది. వేగంగా నిర్ణయాలు తీసుకుని, వాటికి కట్టుబడి, ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ, నిద్రాహారాలు మాని ఈ చిత్రం కోసం అమితంగా శ్రమించాడు. Also Read: Yash Mother :…
చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను.…