అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అంటూ అధికారులపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అధికార పార్టీ ఎమ్మెల్యే… కొమురం భీం జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది… జిల్లా పరిషత్ సమావేశంలో ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప… కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నుండి కాగజ్ నగర్ వెళ్లే రోడ్డుపై ఎందుకు అలసత్వం చేస్తున్నారని ప్రశ్నించారు..…
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. అయితే, ఇది డ్రామా అని కొట్టిపారేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్.. బీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు.. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీనిపై సీబీఐ విచారణకు కోరడం లేదు అని ప్రశ్నించారు.. అయితే, ఈ డీల్…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.. అయితే, ఆ నలుగురిలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు రంగ ప్రవేశం చేసినట్టు చెబుతున్నారు.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. దీంతో.. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇంతకీ రోహిత్ రెడ్డి చేసిన…
ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.. ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీ డీల్కు ప్రయత్నించడం.. ఆ ఎమ్మెల్యేలే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం పెద్ద రచ్చగా మారింది.. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.. డీల్ సమయంలో.. ఢిల్లీలోని పెద్దలతోనూ మాట్లాడించే…
బీజేపీకి గుడ్బై చెప్పి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్.. ఈ మేరకు బీజేపీ జీతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు..
హిందువులు ఎంతో భక్తితో ఎదురు చూసే మాసం రానేవచ్చింది.. ముఖ్యంగా ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. పుణ్యస్నానాలు ఆచరించేవారు, మాలధారణ చేసేవారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారు.. వ్రతాలు చేసుకునేవారికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది.. ఇక, కార్తిక మాసం ఇవాళ ప్రారంభం కావడంతో.. శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది..
నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ సాయంత్రం 5గంటలలోపు మక్తల్ చేరుకోనున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది.