Anesthetic Injection: ఖమ్మంని కమ్మేసిన మత్తు.. వెలుగులోకి మరో ‘సూది హత్య’
ఖమ్మంలో మత్తు ఇంజెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న తాజాగా లిప్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి బైక్ తో పరాయ్యాడు నిందితుడు ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు భార్యే పక్కడ్బందీగా భర్త పై హత్య చేయించిందని నిర్ధారణకు వచ్చారు. దీనికి గల కారణ వేరొకరితో వివాహేతర సంబంధమే అని పోలీసులు తేర్చారు. ఈ ఘటన మరువకముందే మరో మత్తు ఇంజక్షన్ ఘటన వెలుగుచూసింది. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరి మధ్య తరుచూ గొడవలు. ఇద్దరిలో ఒకరిని చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి లేదు అనుకున్నాడు. ఈనేపథ్యంలో.. చిన్న భార్యకు మత్తుమందు ఇచ్చి చంపేశాడు. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా, అనస్థీషియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో వివాహం అయ్యింది వీరికి పిల్లలు పుట్టలేదు. అయితే.. పిల్లలు కావాలని తనకంటే ఇరవై ఏళ్ల చిన్నది అయిన నవీనను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా.. కొద్దిరోజులు ముగ్గురూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే.. నవీనకి పాప పుట్టింది. దీంతో.. ఇద్దరు భార్యల మధ్యగొడవలు మొదలయ్యాయి. ఈక్రమంలోనే నవీన రెండోసారి గర్భం దాల్చింది. రోజూ గొడవలతో విసిగిపోయిన భిక్షం భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
భార్య ప్రసవంకోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమెకు ఆడ శిశువు పుట్టింది, మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన ఆస్పత్రిలోనే మృతిచెందింది. అయితే.. సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు భిక్షం. దీంతో.. నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయింది అర్థం కాని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. ఇక చేసేదేమి లేక బిక్షం కూతుర్లు ఇద్దరికీ ఆర్థిక సాయం చేస్తామని సదరు ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే.. ఆందోళన విరమించిన భిక్షం నవీన మృతదేహాన్ని ఊరికి తీసుకు వెళ్ళకుండా ఖమ్మంలోనే స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. దీంతో.. నవీన అంత్యక్రియలను ఖమ్మంలో నిర్వహించడంతో ఆసుపత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది.
ఇక హాస్పిటల్ లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే.. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బిక్షం తన భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం.. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావిడి చేయడం కనిపించాయి. దీంతో.. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీస్ లను సంప్రదించింది. అయితే.. స్వాతంత్ర వజ్రోత్సవాలు, వినాయక చవితి నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. అయితే.. ఇటీవల భిక్షంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన రెండో భార్య నవీనకు ఇంజక్షన్ ద్వారా అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే.. జమాల్ సాహెబ్ ఘటనతో ఇది కూడా వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో