దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్ పై ఇవాళ రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది.
తెలంగాణాలో క్రైం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది.. మొన్నటివరకు రోడ్డు ప్రమాదాలతో జనాలు అనేక ఇబ్బందులు పడితే.. నేడు హత్యలు కలకలం రేపుతున్నాయి.. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగడం వల్లో కుటుంబ కలహాల వల్లనో హత్యకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.. క్షనీకావేశంలో జరిగే హత్యలతో కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.. తాజాగా పెద్దపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.. నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి అతి కిరాతాకంగా సజీవ దహనం…
రానున్న రెండు రోజులు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం, గురువారం అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలోని గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారిక పోర్టల్ అని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.