BJP Meeting: ముగిసిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. ఇక, ఈ మీటింగ్ లో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు జేపీ నడ్డా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మీటింగ్ లో దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎజెండాను రూపొందించాలని ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు.
Read Also: Tamilnadu: గవర్నర్ తొలగించబడడానికి అర్హులు.. రాష్ట్రపతికి తమిళనాడు సీఎం లేఖ
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు జేపీ నడ్డా సూచించారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి కారణాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించారు. ఈ సందర్భంగానే పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పని తీరు అద్భుతం ఉందని ఆయనను నడ్డా ప్రశంసించాడు. పార్టీని పటిష్ట పరిచి బూత్ కమిటీలు పూర్తి చేయాలని నేతలకు జేపీ నడ్డా ఆదేశించాడు. దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మీటింగ్ లో బీజేపీ 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Also: Beard: గడ్డం పెరగాలంటే ఇలా చేయండి..!
ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రబాద్ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళీ అమ్మవారికి నడ్డా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అక్కడ నుంచి శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. అయితే ఇప్పటికే నోవాటెల్ హోటల్ కు తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు చేరుకుంటన్నారు. బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, విజయశాంతి, వివేక్ వెంటకస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీబీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు డీకే అరుణ, తరుణ్ చుగ్ చేరుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికల స్ట్రాటజీ, నాయకుల మధ్య సమనవ్యయంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత ఇది మొదటి సమావేశం.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!