ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ కళాశాల కామర్స్ ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొపెసర్ రవి కుమార్ ప్రస్తుతం ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డెరైక్టర్గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా, యుఎఫ్ఆర్ఓ డెరైక్టర్గా, సీడీఈ జాయింట్ డెరైక్టర్గా, పరీక్షల విభాగం ఆడిషినల్ కంట్రోలర్గా, సెంటినరి ఉత్సవాల కోఆర్డినేటర్గా బాధ్యతలు…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ని మార్చబోతున్నారన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా మార్పు మాట వినిపిస్తున్నా... అంత కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ... ఇప్పుడు మాత్రం మేటర్ వేరుగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తర్వాత పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అధిష్టానం.
కవిత సీఎం.. సీఎం కవిత.. అంటూ చేసిన స్లోగన్స్ పార్టీలో వెయ్యి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయట. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు. పార్టీ అధికారంలో లేదు, అధ్యక్షుడు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నారు. కానీ... ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అసలదేం ప్రశ్న?
కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీ.. ఏం చేద్దాం..? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు…
Ponnam Prabhakar : త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే సంకల్పంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. గురువారం, సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్ లో పర్యటించిన ఆయన, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ప్రస్తుతం నుంచే పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా…
CMR College : మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి లోపలికి ఎవరినీ అనుమతించడం…
Punishment For Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు, అతని స్నేహితురాలికి జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వెస్ట్మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే 27 ఏళ్ల తీగుళ్ల దయా సాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల ఫిలింనగర్లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు, దయా…
Revanth Reddy New Year Wishes: కొత్త సంవత్సర 2025 సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలోనూ శుభం, సంతోషం నిండి, అన్ని మంచినీటులు కలగాలని వారు కోరుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. Also Read: UnstoppableWithNBK : రెబల్ స్టార్ కు రామ్ చరణ్ ఫోన్.. ఎందుకంటే.? నవ వసంతంలో… విశ్వ…
ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదన్నారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని, ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యెక వ్యవస్థ ఉండాలన్నారు. మాతృ భాష నేర్చుకోవాలి కానీ.. మాతృ భాషలోనే బోధన అంటే కరెక్ట్ కాదని ఆకునూరి మురళీ పేర్కొన్నారు. ‘ప్రైవేట్…