తెలంగాణలో రోజుకో ఫేక్ పోలీస్ పుట్టుకొస్తున్నాడు. మొన్న నకిలీ డీస్పీ స్టోరీ మరిచిపోక ముందే మరో ఇద్దరు ఫేక్ పోలీసులు దొరికిపోయారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఖాకీల అసలు రంగు బయట పడింది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్టేషన్ పరిధిలో మొత్తం ముగ్గురు నకిలీ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SOT పోలీసుల పేరుతో గత కొంతకాలంగా స్థానికులను బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు…
హుజూరాబాద్ ఉప ఎన్నికపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే మండలాల వారిగా పార్టీ ఇంచార్జీలను నియమించింది. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు కూడా నియెజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక షెడ్యులు వచ్చేనాటికి నియెజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై టిఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులను ఉప ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో ఉన్నారు ముఖ్యనేతలు. ప్రధానంగా నియెజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలపై…
ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు. అయితే,…
తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఒక పార్టీ నుండి… ఇంకో పార్టీకి వలసలు సహజమయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలోకి నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు. పార్టీలోకి ఎవరిని…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఐదుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 729 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,37,373కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,23,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,764కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.29 శాతంగా…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్.. నా హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడం సంచలనంగా మారింది.. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు.. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. నన్ను నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు.. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అంటూ ఆయన కామెంట్ చేశారు.. అయితే, ఈటల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి గంగుల కమలాకర్.. ఈటల…
తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్కు సైబర్ కేటుగాళ్లు కన్నం వేశారు.. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.2 కోట్లు కాజేశారు.. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. బ్యాంక్ మూల ధనం నుంచి రెండు కోట్లు కొట్టివేసిన నైజీరియన్ను పట్టుకున్నారు సీసీఎస్ పోలీసులు.. దీంతో అపెక్స్ బ్యాంకులో నగదు మాయం కేసులో అరెస్ట్ల సంఖ్య రెండుకు చేరింది.. హైదరాబాద్ టోలిచౌకిలో నివాసముంటున్న నైజీరియన్ లేవి డైలాన్ రోవాన్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు…
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం వారి వేతనం నెలకు రూ.15 వేలు ఉండగా.. దానిని రూ.28,719కి పెంచింది నిర్ణయం తీసుకుంది.. ఈ నెల నుంచే పెరిగిన వేతనాలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చెల్లించనుంది సర్కార్.. ఇక, ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్…
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఓ ప్రయాణికుడి దగ్గర రూ.25 కోట్ల విలువ చేసే 3.2 కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు.. సినీ పక్కీలో మాదకద్రవ్యాలను మలద్వారంలో తరలిస్తుండగా.. కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు.. ఇక, 3.2 కిలోల హెరెయిన్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మధ్య తరచూ దేశంలోని అంతర్జాతీయ…
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. చదువుకున్నోళ్ళందరికీ సర్కార్ ఉద్యోగం రాదని.. హమాలీ పని చేసుకోవాలని సూచించారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కామెంట్స్ తప్పుగా అన్వయించారని తెలిపారు. యువత మనోభావాలను దెబ్బతీసేలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, యువత ఎవరు బాధ పడవద్దన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత ప్రిపేర్ అవ్వండి.. నోటిఫికేషన్లు రాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఏపీ-తెలంగాణ జల వివాదంపై మాట్లాడుతూ.. కేంద్రం…