టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రౌడీ సీట్ ఓపెన్ చేయాలి.. కాంగ్రెస్ నేత డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ… కల్వకుర్తిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నాం అన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించిన ఆయన.. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రిని దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదు..? సీఎం అంటే మీకు భయమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయంలో దళితులకు భూ పట్టాలు ఇస్తే.. వాటిని టీఆర్ఎస్ గవర్నమెంట్ గుంజుకుంటుందని విమర్శించారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినం కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారంటూ ఘాటుగా కమెంట్ చేశారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ దళిత బంధుకి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన వంశీ కృష్ణ.. కేవలం హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్రం మొత్తం దళితబంధును ఇవ్వాలని డిమాండ్ చేశారు.. టీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం లేకుండా అధికారం, భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని సెటైర్లు వేసిన ఆయన.. ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ ఒక రౌడీ లాగా వ్యవహరిస్తున్నాడని… అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు గువ్వల బాల్ రాజ్.. గుంతల బాల్ రాజ్.. గువ్వల బాల్ రాజ్ కాదు.. గుప్తనిధుల బాల్ రాజ్ అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ దళితులకు భూ సంస్కరణలు చేసిన పార్టీ అని గుర్తుచేశారు వంశీ కృష్ణ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆంధ్రకు తరలిస్తే కమిషన్ లకు కక్కుర్తి పడి అడ్డుకోలేక పోతున్నారంటూ టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు గుప్పతించిన ఆయన.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులు భేషరత్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.. సీఎం మెప్పు కోసం మాట్లాడే మాటలను టీఆర్ఎస్ నేతలు బంద్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!