తెలంగాణలో రాజకీయాలు దళిత, గిరిజనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంద్రవెల్లి ఘటన సాక్ష్యంగా దళిత, గిరిజన దండోర సభ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్కూ అన్యాయం జరిగిందని రేవంత్రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్దేనని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేసి రెణ్నెళ్లకే తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వందల దిగువకు చేరిన తర్వాత స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 453 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 614 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859కు చేరుకోగా……
త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పోడు భూములకు రైతుబంధు అందిస్తున్నామన్న ఆయన.. త్వరలోనే అటవీ భూములను సర్వే చేస్తామని చెప్పారు.. ఇక, ఆదివాసీల సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కొమురంభీం భవనాన్ని నిర్మిస్తామన్న సీఎం.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఆదివాసీ గూడెంలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేశామని గుర్తుచేసిన తెలంగాణ సీఎం.. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు మ్యూజియాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా,…
ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ…
బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఒక భాగం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. లాభం జరిగే దళిత వర్గాలకు నష్టం కలిగే కుట్ర బీజేపీ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను వాడుకొని చేస్తోంది. కేవలం రాజకీయ విమర్శల కోసం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ… ప్రవీణ్ కుమార్ కలలు కలగానే మిగిలిపోతుంది. ప్రవీణ్ కుమార్ ఆయన ఎజెండా చెప్పాలి!. అర్థం…
ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట పట్టణంలోని ఎంపిఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దేశానికి దిక్సూచి దళిత బంధు పథకం. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చూశారు. దళితుల దారిద్రయాన్ని పోగెట్టెందుకు ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. ఒక దళిత కుటుంబానికి నేరుగా రూ.10లక్షలు ఖాతాలో వేయడం సంతోషకరమైన విషయం అన్నారు. రూ.500కోట్లు కేవలం మొదటి వీడుత మాత్రమే. రాష్ట్ర…
షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య ఖండించాడు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని.. తెలంగాణ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డినా..? తెలంగాణనా అంటే..? తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు రాశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారు. గతంలో ఓ క్రైస్తవ…
రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తాం అని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. దళిత బంధు తో తమ కాళ్ళమీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుంది. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళిత…
ఆదివాసీ లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి లో ఎలా సభ పెడుతుంది అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రశ్నించింది. మా పండగ రోజు రాజకీయ సభకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ , రాష్ట్రప్రభుత్వందే భాద్యత అని తెలిపింది. ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కే రెండు సార్లు మోసం చేసింది. ఇప్పుడు మూడో సారి మా ఆదివాసీ దినోత్సవాన్ని హైజాక్ చేస్తోంది. 1976 లో కాంగ్రెస్ పార్టీ…