వృద్ధాప్య పెన్షన్లకు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తగ్గించిన వయో పరిమితిని అనుసరించి అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ/మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి…
ఆగస్టు 19 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించబోయే.. జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం కానుంది. కోదాడ నుండి హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ లో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి దర్శనం, వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఖిల్లాషాపూర్…
గతంలో కేంద్రమంత్రిగా పనిచేసి.. ఓ వెలుగు వెలిగిన ఆయన కొన్నాళ్లూగా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో.. సడెన్గా చర్చల్లోకి వచ్చారు. ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించి ఆశ్చర్యపరిచారు. దీంతో ఆయన దారెటు? కొత్త కామెంట్స్.. కొత్త ప్రయాణానికి సూచికా లేక.. పాత శిబిరంలో సర్దుకుపోతారా అని అనుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? దళితబంధుపై సర్వే ప్రశంసల జల్లు!సర్వే కామెంట్స్తో సంబంధం లేదన్న కాంగ్రెస్! సర్వే సత్యనారాయణ. కేంద్ర మాజీ మంత్రి. ఇటీవల బీజేపీ నాయకులు ఆయనతో…
తెలంగాణ కాంగ్రెస్లో వార్ కంటిన్యూ అవుతూ ఉంది. దళిత గిరిజన దండోరా సభ వేదికపై పార్టీలోనే రచ్చ జరుగుతోంది. ఇంద్రవెల్లి సభ జోష్ లో.. ఇబ్రహీంపట్నంలో దళిత గిరిజన దండోరా సభను ప్రకటించారు పిసిసి చీఫ్ రేవంత్. అక్కడే హస్తంపార్టీలో పంచాయతీ మొదలైంది. ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. పిసిసి చీఫ్ ఎవరిని అడిగి ఈ సభను ప్రకటించారని కోమటిరెడ్డి… అటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్రుగా ఉన్నారు. స్థానిక ఎంపి సభకు రాకుంటే సభతో…
కొత్త లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. జీఎస్టీ తర్వాత ఖజానాకు అధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. దీంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు, షాపుల వేలం ద్వారా ఈ ఏడాది దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆర్జించాలని తెలంగాణ ఎక్స్జైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. తాజా లెక్కల ప్రకారం ఖజానాకు ఏటా 24 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుండటంతో.. మద్యం అమ్మకాలపై మరింత ఫోకస్ పెడుతోంది తెలంగాణ…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 87,509 శాంపిల్స్ పరీక్షించగా… 427 మందికి పాజిటివ్గా తేలింది… మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 609 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,715 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,40,065 కి పెరిగింది.. ఇక,…
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. ఏది చెబితే అవతలి వ్యక్తి బుట్టలో పడతాడో.. మరీ గెస్చేసి ఊబిలోకి లాగేస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి దండుకుంటున్నారు.. తాజాగా హైదరాబాద్లో స్కూల్ ఫ్రెండ్ను అంటూ ఏకంగా రూ.14 లక్షలు మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.. దీనికి సోషల్ మీడియాను వాడుకున్నారు.. ఇన్స్టాగ్రామ్ లో స్కూల్ ఫ్రెండ్ని అంటూ హైదరాబాద్కు చెందిన మహిళతో పరిచయం చేసుకున్న.. కేటుగాడు.. మీకు గిఫ్ట్లు పంపిస్తానంటూ నమ్మబలికాడు.. ల్యాప్టాప్, విలువైన గిఫ్ట్స్,…
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయాలని దళిత బంధు పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు సీఎం కేసీఆర్.. అయితే, దళిత బంధుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దు అని చెబుతున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత బంధు ఆపించే కుట్రలు జరుగుతున్నాయని.. దళిత బంధు అమలు అయితే…
దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్…
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ విజయంవతం అయిన తర్వాత టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై సెటైర్లు వేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్.. ఇంద్రవెల్లి సభ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందనే నమ్మకం కలిగిందన్న ఆయన… కానీ, టీఆర్ఎస్ నేతలకు మాత్రం సురుకు తగిలిందన్నారు.. అందుకే అందరూ నేతలు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు.. కొత్త చైతన్యంతో కాంగ్రెస్ నేతలు అన్ని నియోజకవర్గాలలో దండోరా వేయడానికి సిద్ధం అవుతున్నారని.. తెలంగాణ…