వృద్ధాప్య పెన్షన్లకు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తగ్గించిన వయో పరిమితిని అనుసరించి అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ/మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పుట్టిన తేదీ ధృవీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది.