కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు.…
ఖర్చులకు డబ్బులు కావాలా..ఇంట్లో స్నేహితులను అడిగితే డబ్బులు ఇవ్వడం లేదా..లేకపోతే ఎవరినైనా చేబదులు అడగాలంటే సిగ్గుగా అనిపిస్తుందా? బ్యాంకుల చూట్టు తిరిగే ఓపిక లేదా? డోంట్ వర్రీ ఇకపై మీకు ఆ ఇబ్బంది లేదు….ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే సెకన్లలో ఆన్ లైన్ లో మీ ఎకౌంట్ కు డబ్బులిచ్చేస్తాం అంటున్నారు ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్ నిర్వాహకులు. ఇదేదో ప్రజాసేవ కాదు….మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని పీక్కుతినే మైక్రోఫైనాన్స్ లాంటి దిక్కుమాలిన ఆన్…
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు చాలా మంది ఎన్నో కేసులు వేశారని.. అయినా తాము వెనక్కి…
సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రిజర్వాయర్ను ప్రారంభించడానికి ముందు కేసీఆర్ మల్లన్నకు పూజలు నిర్వహించారు. అనంతరం రిజర్వాయర్ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు మాట్లాడారు. మల్లన్న సాగర్ తెలంగాణకే తలమానికం అని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు ఆగలేదని, ప్రాజెక్టుపై వందలాది కేసులను సుప్రీంకోర్టు కోట్టేసిన…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్కు చేరుకున్నారు. ఈరోజు మల్లన్నసాగర్ రిజర్వాయర్ను రాష్ట్రప్రజలకు అంకితం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మల్లన్నసాగర్కు చేరుకున్నారు. మల్లన్న సాగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీష్రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ అతిపెద్ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ లో 50 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంటుంది. ఈ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట…
జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ తనకంటూ ఎవరు లేని జీవితం ఎందుకు అనుకుంది.. ఎవరికి భారం కాకూడదనుకుంది. కళ్లముందే కొడుకు, కోడలు మరణాన్ని చూసింది.. మనవడికి భారం కాకుండా తన దారిన తను వెళ్లిపోవాలనుకొని కఠినమైన నిర్ణయం తీసుకొంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమె.. ఆ మంచాన్నే తన చితిగా మార్చుకొంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంచానికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.…
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందుతున్నది. ప్రజల ఆలోచనలు, కల్చర్ సైతం మారిపోతున్నది. ట్రెండ్కు తగ్గట్టుగా ఆలోచిస్తున్నారు. పైగా కరోనా తరువాత చాలా మార్పులు వచ్చాయి. కరోనాకు ముందు ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. కానీ, ఆ తరువాత మార్పులు వచ్చాయి. సినిమా థియేటర్లను పక్కన పెట్టి ఒటిటి ద్వారా సినిమాలు చూస్తున్నారు. అయితే, ప్రజల సౌకర్యార్థం నగరంలో డ్రైవ్ ఇన్ థియేటర్స్ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కార్లలోనే కూర్చొని…
సిద్దిపేట జిల్లాలోని తుక్కాపూర్ మండలం పరిధిలోనున్న మల్లన్నసాగర్ జలాశయంను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదైన మల్లన్నసాగర్ను రాష్ట్రప్రజలకు కేసీఆర్ అంకితం చేయనున్నారు. మల్లన్నసాగర్ పూర్తిసామర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇందులో 30 టీఎంసీల నీటిని జంటనగరాల తాగునీటికోసం తరలిస్తారు. పారిశ్రామిక అవసరాలకోసం 16 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ఈ మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కొత్తపాత ఆయకట్టు కలిపి మొత్తం 15,71,050 ఎకరాలు రానున్నాయి. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున మొత్తం ఐదు…
వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్ విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్ బెంగళూరు-బీదర్-బెంగళూరు హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్ హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్ ముంబై-నాందేడ్-ముంబై ముంబై-కొల్హాపూర్-ముంబై ముంబై-జలగావ్-ముంబైఈ రూట్లలో ట్రూజెట్…