Telangana Cabinet: త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తవుగానే మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పూర్తిస్థాయిలో మంత్రిత్వశాఖల సమూల మార్పులు కూడా జరగవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశం కానున్నారు.
8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?
అందిన సమాచారం మేరకు ఈ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రం కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్నా, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ కే.సి.వేణుగోపాల్ నిన్న రాత్రి గంటకు పైగా కూలంకషంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో సమాలోచనలు చేశారు.
Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్థితులు, ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇతర అనేకాంశాలను, సమీకరణాలను, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, రాష్ట్ర ప్రజలకిచ్చిన వాగ్దానాలను, పలు అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే లక్ష్యంతో మంత్రివర్గంలో సమూల మార్పులు, చేర్పులు చేయాలని
అధిష్ఠానం నిర్ణయం తీసోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి, ముగ్గురికి కొత్తగా అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి నేటి సమావేశం ముగిసాక మరిన్ని వివరాలు తెలియనున్నాయి.