Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktr Singereni Tenders Football Funds Revanth Reddy Controversy

KTR : సింగరేణితో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు..

Published Date :January 27, 2026 , 8:00 pm
By Gogikar Sai Krishna
  • సింగరేణి టెండర్లపై కేటీఆర్ ఘాటు విమర్శలు
  • కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే నిబంధనలు?
  • 10 కోట్లు ఫుట్‌బాల్‌ కోసం? ప్రభుత్వంపై ఆరోపణలు
  • 'రింగ్ మాస్టర్' ఎవరు? శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్
KTR : సింగరేణితో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సింగరేణి సంస్థలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు  చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టి, తన సొంత బంధువులకు , అనుకూలమైన కాంట్రాక్టర్లకు మేలు చేసేలా నిబంధనలను మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా సంస్థకు చెందిన నిధులను పక్కదారి పట్టిస్తూ, బొగ్గు గనుల టెండర్లలో వేల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు.

తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆటవస్తువులా మార్చుకుందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ తాను కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణికి సంబంధించిన సుమారు 10 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఫుట్బాల్ క్రీడల కోసం దుర్వినియోగం చేశారని, ఇది సంస్థకు తీరని అన్యాయం చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వినోదం కోసం సంస్థ నిధులను వాడుకుంటూ, కార్మికుల కష్టార్జితాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, రాష్ట్ర ప్రజలతో ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

2026 T20 World Cup: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!

సింగరేణిలో ‘ఓవర్ బర్డన్’ (OB) టెండర్ల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆధారాలతో సహా వివరించారు. భారతదేశంలోని ఏ బొగ్గు గనిలోనూ లేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే విధానాన్ని ఇక్కడ ఎందుకు అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధన రాకముందు జనవరిలో జరిగిన టెండర్లలో కంపెనీలు అంచనా వ్యయం కంటే 7 శాతం తక్కువకే పని చేయడానికి ముందుకు వచ్చాయని, కానీ ఆ టెండర్లను ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి కొత్త నిబంధనను తెచ్చారని మండిపడ్డారు. దీనివల్ల ఇప్పుడు అదే పని కోసం అంచనా వ్యయం కంటే 12 శాతం అదనంగా అంటే ‘ప్లస్ టెండర్ల’ రూపంలో వందల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికేనని స్పష్టం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావమరిది సృజన్ రెడ్డి ‘రింగ్ మాస్టర్’గా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెండర్ వేయడానికి కావాల్సిన సైట్ విజిట్ సర్టిఫికేట్లను కేవలం కొంతమంది సెలెక్టివ్ కాంట్రాక్టర్లకే జారీ చేస్తూ, మిగిలిన వారిని పోటీ నుంచి తప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి బంధువుల ప్రమేయంపై తాము సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని విమర్శించారు. ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు గని టెండర్లలో కూడా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నాయని, ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Amazfit Active Max: అమాజ్‌ఫిట్ న్యూ స్మార్ట్‌వాచ్ రిలీజ్.. AMOLED డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brs vs congress
  • Football Funds
  • ktr
  • OB Tender Scam
  • revanth reddy

తాజావార్తలు

  • CM Revanth Reddy : మండలానికి ఒక పోలీస్ స్టేషన్.. పని భారం తగ్గిస్తాం.. సీఎం రేవంత్ కీలక హామీలు.!

  • Stop Eating 3 Hours Before Sleep: పడుకునే 3 గంటల ముందే భోజనం ముగిస్తే ఏం జరుగుతుంది..? స్టడీలో వెలుగులోకి కీలక అంశాలు..

  • Telangana: తెలంగాణ మహిళా రైతులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

  • Mohabbat Ka Sharbat: వేసవిలో అదిరిపోయే హెల్దీ డ్రింక్! తక్కువ టైంలో.. సింపుల్‌గా పుచ్చకాయతో ఇలా చేయండి..

  • Gary Kirsten: భారతదేశం T20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత గ్యారీ కిర్‌స్టన్‌కు కొత్త బాధ్యతలు..

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions