Home
Telangana Political News
Telangana Political News News
-
Secunderabad: ‘సికింద్రాబాద్ బచావో’!.. నగరంలో పొలిటికల్ వార్..
Secunderabad: సికింద్రాబాద్ చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. సికింద్రాబాద్కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్కు మద్దతుగా ‘సికింద్రాబాద్ బచావో’ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోగా, ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
MP Arvind: అవును.. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
MP Arvind: శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ని ఇందూర్గా పేర్కొన్న ఆయన.. ఆ పేరు ఎలా వచ్చిందో చారిత్రిక ఆధారాలు ఉన్నాయన్నారు. తాజాగా మీడియాలో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు.. నిజామాబాద్కి ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారన్నారు. ఇందూర్గా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని అనుమానం… -
MLA Defection Case: ఇదే స్పీకర్ కు చివరి అవకాశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
MLA Defection Case: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇదే చివరి అవకాశం అంటూ కోర్టు స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఈలోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. ఇకపై కూడా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తగిన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పీకర్కు హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. Vijay… -
Kishan Reddy: జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికం..
Kishan Reddy: తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్ట్ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ఇంకా విచారణ జరుపుతూనే ఉందని.. ఇంతలోపే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి,… -
Jagga Reddy: “ఇది మంచిది కాదు”.. జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన జగ్గారెడ్డి..
Jagga Reddy: ఎన్టీవీలో వచ్చిన ఓ కథనంపై రేవంత్ సర్కార్ "ఓవర్ రియాక్షన్" చేస్తోంది. జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ ప్రతాపంపై పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఖండించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీకి… -
KTR: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు
KTR on Journalist Arrests: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం, వారిని నేరస్థులలా తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన నాటి చీకటి రోజులను, ఎమర్జెన్సీ అణచివేత ధోరణిని గుర్తుకు తెస్తోందన్నారు. బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి కానీ, ఇలా భయోత్పాతం సృష్టించడం… -
Duddilla Sridhar Babu : నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన వారు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు పడిన అష్టకష్టాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. “అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర మీది కాదా? నాడు నోటిఫికేషన్ల పేరుతో… -
Janasena: జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీలు రద్దు..
Janasena: జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు.. అయితే, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్… -
OTR: కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ డ్రైవ్.. తెలంగాణ శాఖల్లో భారీ లీకులు బట్టబయలు..
OTR: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లీకులకు సీలేసే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఒక్కో డిపార్ట్మెంట్లో అనధికారికంగా పక్కదారి పడుతున్న ప్రభుత్వ సొమ్ముకు అడ్డుకట్ట వేసే పని మొదలైంది.ఇప్పటికే మైనింగ్ డిపార్ట్మెంట్ లీక్స్కు ఎమ్సీల్ వేసేశారట. దాంతో ఈ ఏడాది ఏకంగా 22 శాతం ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఇక ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కడెక్కడ ప్రభుత్వ ధనం వృధా అవుతోందో లెక్కలు తీసి పూర్తిగా కట్టడి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. అందులో భాగంగానే…… -
Off The Record: తెలంగాణలో మిత్రభేదం మొదలైందా? కాంగ్రెస్ సీపీఐ మధ్య ఏం జరుగుతుంది?
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. అయితే.. అదంతా గతం. వర్తమానానికి వస్తే… ఇప్పుడిక్కడ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కూనంనేని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తేడా వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించమే గ్యాప్నకు ప్రధాన…
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!