Kadam Project: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో కడెం పరివాహక ప్రాంతానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 20.138 క్యూసెక్కులు ఔట్ ఫ్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు, మొదలైన జీవాలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.…
Godavari Floods: తెలంగాణ రాష్ట్రంలో ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద వరద నీరు జ్ఞాన దీపాలను ముంచేయగా, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీరంలో ఉన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్లో…