రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన.. ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపు కున్నాడని.. ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నాడు.. ఎమ్మెల్యే కోసం పవన్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు…
KCR: ఢిల్లీలోని తన అధికార నివాసంతో మాజీ సీఎం కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. అయితే.. అప్పట్లో ఎంపీగా ఉండటంతో 2004 నుంచి ఆయనకు ఢిల్లీ 23 తుగ్లక్ రోడ్లోని ఇల్లు అధికారిక నివాసంగా ఉంది.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. 2024లో 350 సీట్లకు పైగా గెలిచి మరలా మరోసారి ప్రధాని మోడీ అని మరోసారి రుజువు చేసిన ప్రజా తీర్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని 40 స్థానాల్లోపే పరిమిత చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేయగా.. చాలా నియోజకవర్గాల్లో మహిళలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులెవరో తెలుసుకుందాం..
BJP: తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్నా.. అధికారంలో కోసం పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్నామ్నాయమని చెప్పుకున్న బీజేపీ గతంలో కన్నా మెరుగైన సీట్లను, ఓట్ షేర్ని సాధించింది. 2018 ఎన్ని్కల్లో 7 శాతం ఓట్ షేర్తో కేవలం ఒకే స్థానాన్ని గెలిచిన బీజేపీ ఈ సారి ఏకంగా 14 శాతం ఓట్లను సాధించి…
ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాజీనామా పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. కాన్వాయ్ లేకుండానే ప్రగతి భవన్ నుంచి రాజ్భవన్కు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.
ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకున్నారు. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నామన్నారు. తనపై గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్కు వెళతారని సమాచారం.