Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ambani: అనిల్ అంబానీ ఫ్యామిలీకి చిక్కులు తప్పడం లేదు. ఇటీవల అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరు కావాలని ED సమన్లు జారీ చేసింది. అయితే ఆమె ఈడీ ముందుకు హాజరు కాలేదు. దీంతో తాజాగా ఫిబ్రవరి 17న హాజరు కావాలని ఈడీ నేడు ఆమెకు కొత్త సమన్లు జారీ చేసింది. అలాగే ఫిబ్రవరి 18న తేదీన అనిల్ అంబానీ హాజరు కావాలని ED సూచించింది.
READ ALSO: Russia: ఖరీదైన చమురు కొనాలని భారత్పై అమెరికా ఒత్తిడి: రష్యా..
Also Read
- Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
- E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
- India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ ఏజెన్సీ సోమవారం తమ ముందు హాజరు కావాలని టీనాను కోరింది, కానీ ఆమె వారి ముందు హాజరు కాలేదు. ఈ సమన్లకు రిలయన్స్ గ్రూప్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక రిలయన్స్ గ్రూప్ కంపెనీలు, వాటి బ్యాంకు రుణాలపై దర్యాప్తులో భాగంగా గత సంవత్సరం ఒకసారి అనిల్ అంబానీని ED ప్రశ్నించింది. న్యూయార్క్లోని మాన్హట్టన్లో ఒక లగ్జరీ కండోమినియం కొనుగోలుకు సంబంధించిన డబ్బు జాడ గురించి ప్రశ్నించడానికి తాజాగా టీనా అంబానీకి ఈడీ సమన్లు పంపినట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాజీ అధ్యక్షుడు పునీత్ గార్గ్ను అరెస్టు చేసింది. గతంలో ఈడీ జారీ చేసిన ఒక ప్రకటనలో.. 2023లో RCOM కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో గార్గ్ ఈ న్యూయార్క్ ఆస్తిని మోసపూరితంగా విక్రయించారని ED పేర్కొంది. 2025లో ఈ మోసపూరిత అమ్మకం గురించి RCOM స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసిందని సమాచారం. ఈ అమ్మకం నుంచి $8.3 మిలియన్లు లేదా 2023లో సుమారు రూ.695.5 మిలియన్లు మోసపూరిత పెట్టుబడి ఏర్పాటు పేరుతో అమెరికా నుంచి పంపినట్లు ఈ ఏజెన్సీ పేర్కొంది. ఇది రిజల్యూషన్ ప్రొఫెషనల్కు తెలియకుండా లేదా ఆమోదం లేకుండా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్పై జరిగిన బ్యాంకు మోసం, సంబంధిత ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అనేక కేసులను దర్యాప్తు చేయడానికి ED ఇటీవల ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా ED సుమారు రూ.12,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి, రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మూడు ECIRలు (దర్యాప్తు ఫిర్యాదులు) దాఖలు చేసింది.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!