Jupally Krishna Rao : తెలంగాణ పర్యాటక అభివృద్ధిపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన
- తెలంగాణ పర్యాటక అభివృద్ధి లక్ష్యాలు
- ప్రత్యేక పర్యాటక ప్రాంతాల (STA’s) అభివృద్ధి
- హైదరాబాద్లో నూతన పర్యాటక ప్రాజెక్టులు & భవిష్యత్తు ప్రణాళికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పర్యాటక శాఖపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఈ ప్రభుత్వం దిశానిర్దేశంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
పర్యాటక అభివృద్ధి లక్ష్యాలు
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
రానున్న ఐదేళ్లలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం.
మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం.
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలోనే టాప్ 5 ర్యాంక్లో నిలిపేలా ప్రణాళిక.
రాష్ట్ర ఆదాయంలో 10% కు పైగా టూరిజం ద్వారా సాధించేలా చర్యలు.
ప్రత్యేక పర్యాటక ప్రాంతాల గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ప్రత్యేక పర్యాటక ప్రాంతాల(STA’s)గా గుర్తించి, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంత్రిగారి ప్రకటన ప్రకారం, 27 సెక్టార్లుగా STAలుగా గుర్తింపు లభించిందని చెప్పారు.
నూతన పర్యాటక ప్రాజెక్టులు
ప్రభుత్వం పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు ప్రాజెక్టులను రూపొందించింది. వీటిలో బోటింగ్, హరిత హోటల్స్, వాటర్ స్పోర్ట్స్, రోప్ వే, వెల్నెస్ సెంటర్లు, ఎకో టూరిజం, థీమ్ పార్కులు, సస్పెన్షన్ బ్రిడ్జి, గ్లో గార్డెన్స్, మ్యూజికల్ ఫౌంటెన్స్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైట్ షో వంటి అంశాలకు అనుమతులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
పర్యాటక రంగంలో పెట్టుబడులు & అభివృద్ధి
గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో రూ. 243 కోట్లు ఖర్చు చేయగా, ఈ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 738 కోట్లను కేటాయించింది. ఈ నిధులు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు మంత్రి వివరించారు.
పర్యాటక హోటళ్ల నిర్వహణ
ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 43 హోటళ్లు, 32 రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే 4 హోటళ్లు, 14 రెస్టారెంట్లను ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ఇంతవరకు ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. అందువల్ల, వీటి నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం
కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్రంలో పలు పర్యాటక ప్రాజెక్టులను అమలు చేయడానికి నిధులు మంజూరయ్యాయి:
నల్లమల్ల టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి రూ. 68 కోట్లు.
రామప్ప టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి రూ. 73 కోట్లు.
బుద్ధవనం డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధికి రూ. 25 కోట్లు.
భువనగిరి కోట అభివృద్ధికి రూ. 56 కోట్లు.
మూసీ నది పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తు ప్రణాళికలు
ఫ్యూచర్ సిటీ: గోల్ఫ్ కోర్స్, జాతీయ & అంతర్జాతీయ సమావేశాల నిర్వహణ కోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ తరహాలో 20,000 మంది సామర్థ్యంతో మౌలిక సదుపాయాలు.
హైదరాబాద్ కార్నివాల్: రియో కార్నివాల్ తరహాలో ప్రత్యేక ఉత్సవం నిర్వహించేందుకు ప్రణాళిక.
లండన్ ఐ తరహా అబ్సర్వేషన్ వీల్: హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేయాలని యోచన.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో రాష్ట్రంలో టూరిజం రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు అధునాతన పర్యాటక అనుభవాలను అందించడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!