తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో ఈ వార్త తీరని శోకాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని…
Director Shikha Goel: నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో రిపోర్టులు సేఫ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. ఉదయం 10.08 నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారని చెప్పారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని.. 1.30…
Family Suicide: హైదరాబాద్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్లో ఈరోజు తెల్లవారుజామున హృదయవిదారక ఘటన నెలకొంది.
Kondagattu: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్ట కింద( స్టేజీ వద్ద) ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న స్పార్క్ క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడేలా చేసింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ప్లాస్టిక్, చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటం…
CRPF Strengthens Security at Telangana–Chhattisgarh Border: తెలంగాణ- ఛత్తీస్ఘడ్ సరిహద్దులో భారీగా CRPF భద్రతా బలగాలు మోహరించారు. కర్రెగుట్టలను భద్రతాబలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన సీఆర్ఫీఎఫ్ 39 బెటాలియన్ను సీఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "కర్రెగుట్టలపై అతితక్కువ కాలంలో పట్టు సాధించాం.. ఈ ప్రాంతాన్ని సేఫ్…
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో దాదాపు 20 మంది స్పాట్ లోనే మృతి చెందారు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా మిట్టాపూర్లో జరిగిన మహిళ దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 టీంలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ శవం లభ్యమంటూ పోలీసులు పోస్టర్లు అతికించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లు ముద్రించారు. వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అదించారు. మిస్సింగ్ కేసులు నమోదైతే సమాచారం ఇవ్వాలంటూ నవీపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Nizamabad: నిజమాబాద్లోని నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది…