సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ ప్రకటన చేయాలనుకున్న ఆయన ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా తెలంగాణ భవన్లో దసరా రోజు తన జాతీయ పార్టీని ప్రకటించనున్నారు.
తెలంగాణ భవన్లో స్వాత్రంత్య వజ్రోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు.
తెలంగాణలో నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఉద్యోగాల ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ్యాన్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు మార్చి9 వ తేదీ అన్నారు దానం. నిరుద్యోగులను కాంగ్రెస్, బీజేపీలు ఉసిగొల్పాయి. సీఎం కేసీఆర్…
తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షత విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు జనాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మీరు జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరని ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టండని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు చెప్పండని వివరించారు. కేంద్రం చేతులెత్తేసింది…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.. ధన్యాం కొనుగోళ్ల విషయంలో.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. రైతుల తరపున పోరాటం చేస్తామని ప్రకటించిన ఆయన.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలను టార్గెట్ చేశారు కేసీఆర్.. ఇక, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్.. లైవ్లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఎంపీల సమావేశం ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే… టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ నెల 25 న హైదరాబాద్లోని హైటెక్స్ లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశం పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే… వచ్చే నెల…
సీనియర్ పొలిటికల్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. గత కొంత కాలంగా ఆయన కారెక్కుతారు అనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తున్నారు.. ఇక, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ను తెలంగాణ అంబేద్కర్గా అభివర్ణించారు.. మరోవైపు.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్లో చేరడం.. ఆయనను దళిత బంధు ఛైర్మన్గా నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.. ఈ…
హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ.. మళ్లీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ బాస్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇవాళ టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కాబోతోంది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అలాగే . గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు.. పార్టీ శాఖల ఏర్పాటు కోసం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. దళితబంధు విషయంలో పార్టీ…