IND Vs AUS: ఆదివారం నాడు హైదరాబాద్లో కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా చివరి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ చేరుకున్న అనంతరం టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్ల…
Team India: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించగా.. నాగపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో హైదరాబాద్లో జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక…
Rohit Sharma Record: నాగపూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మొత్తం నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీంతో అతడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (173) రికార్డును చెరిపేశాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 176 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (173),…
IND Vs AUS: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా చెలరేగిపోయింది. 91 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రాహుల్ (10) నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ 11 పరుగులకు అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 9…
IND Vs AUS: నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గురువారం కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా మారడంతో పిచ్ను డ్రై చేయడంలో ఆలస్యమైంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్ను 8 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు. కేవలం 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఇరు జట్లలో హిట్టర్లు చెలరేగే అవకాశం…
IND Vs AUS: మూడు టీ20ల సిరీస్లో భాగంగా నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. నాగపూర్లో ప్రస్తుతం వర్షం కురవకపోయినా.. గత రాత్రి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అవుట్ ఫీల్డ్తో పాటు పిచ్ చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్పై కవర్లు కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్లో ఒకట్రెండు చోట్ల తేమ శాతం అధికంగా ఉంది.…
Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మైదానంలో ఎంత కూల్గా ఉంటాడో అందరికీ తెలుసు. బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా ధోనీ ఎప్పుడూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించదు. అందుకే ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తారు. అయితే తనకు మైదానంలో ఎందుకు కోపం రాదో.. తన కూల్నెస్కు కారణాలేంటో తాజాగా ధోనీ వెల్లడించాడు. తాను…
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 46 పరుగులతో సూర్యకుమార్ రాణించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ను కిందకు నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ ఆజమ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన నెంబర్ వన్ స్థానాన్ని…
Team India: ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి టీ20 చూసిన తర్వాత టీమిండియా అభిమానులందరూ ఓ అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే టీ20 ప్రపంచకప్లో భారత్కు టైటిల్ గెలిచేంత సీన్ అయితే లేదని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు టీ20ల్లో మన జట్టే తోపు అన్న ఫీలింగ్లో ఉన్న అభిమానులే ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్వన్గా ఉన్న మన జట్టు గురించి అంచనాలు పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కానీ…