Shikhar Dhawan: నా పేరు లేకపోవడంతో షాక్కు గురయ్యా: శిఖర్ ధావన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan was bit shocked left out of the India Squad for Asian Games 2023: సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల పాటు మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా ఆడాడు. రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఫామ్ లేమితో గబ్బర్ భారత జట్టుకు దూరమయ్యాడు. చివరగా 2022 డిసెంబరులో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఈ 8 నెలల కాలంలో ఒక్కసారి కూడా జట్టులోకి రాలేదు. భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడాడు.
సెప్టెంబరు 23 నుంచి చైనాలోని హాంగ్జౌలో ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొలిసారిగా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్ 2023 కోసం రోహిత్ సారథ్యంలోని టీమిండియా సీనియర్ జట్టు సన్నద్ధమవుతుండటంతో.. ద్వితీయ శ్రేణి జట్టు ఆసియా క్రీడలకు వెళుతోంది. రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా నియమించిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే ముందుగా ఆసియా క్రీడలకి శిఖర్ ధావన్ను కెప్టెన్గా పంపుతారని నెట్టింట ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ సెలక్టర్లు చివరి నిమిషాల్లో గైక్వాడ్కు పగ్గాలు ఇచ్చి.. ధావన్కు షాక్ ఇచ్చారు. ఆసియా క్రీడలకు ఎంపిక కాకపోవడంపై తాజాగా ధావన్ స్పందించాడు.
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
భారత జట్టులో తన పేరు లేకపోవడంతో కాస్త షాక్కు గురయ్యానని శిఖర్ ధావన్ చెప్పాడు. ‘ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టులో నా పేరు లేకపోవడంతో కాస్త షాక్కు గురయ్యా. కానీ బీసీసీఐ సెలక్టర్లు భిన్నమైన ఆలోచనా విధానంతో ఆ నిర్ణయం తీసుకున్నారని అర్థం చేసుకున్నా. దానిని నేను అంగీకరించాలి. రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందరూ యువకులే. వారు బాగా రాణిస్తారని నాకు నమ్మకం ఉంది’ అని గబ్బర్ తెలిపాడు.
‘పునరాగమనం కోసం నేను సిద్ధంగా ఉంటా. అందుకే నన్ను నేను ఫిట్గా ఉంచుకుంటా. ఇప్పటికీ శిక్షణను, ఆటను ఆస్వాదిస్తున్నా బీసీసీఐ సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను. నా భవిష్యత్తు గురించి నేను ఏ సెలక్టర్తో మాట్లాడలేదు. నేను ఎన్సీఏకు వెళ్తున్నా. అక్కడ నా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. సౌకర్యాలు బాగున్నాయి. ఎన్సీఏ నా కెరీర్ని తీర్చిదిద్దింది. అందుకు నేను కృతజ్ఞుడను’ అని శిఖర్ ధావన్ చెప్పాడు.
తాజావార్తలు
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..