Shikhar Dhawan: నా పేరు లేకపోవడంతో షాక్కు గురయ్యా: శిఖర్ ధావన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan was bit shocked left out of the India Squad for Asian Games 2023: సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల పాటు మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా ఆడాడు. రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఫామ్ లేమితో గబ్బర్ భారత జట్టుకు దూరమయ్యాడు. చివరగా 2022 డిసెంబరులో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఈ 8 నెలల కాలంలో ఒక్కసారి కూడా జట్టులోకి రాలేదు. భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడాడు.
సెప్టెంబరు 23 నుంచి చైనాలోని హాంగ్జౌలో ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొలిసారిగా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్ 2023 కోసం రోహిత్ సారథ్యంలోని టీమిండియా సీనియర్ జట్టు సన్నద్ధమవుతుండటంతో.. ద్వితీయ శ్రేణి జట్టు ఆసియా క్రీడలకు వెళుతోంది. రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా నియమించిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే ముందుగా ఆసియా క్రీడలకి శిఖర్ ధావన్ను కెప్టెన్గా పంపుతారని నెట్టింట ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ సెలక్టర్లు చివరి నిమిషాల్లో గైక్వాడ్కు పగ్గాలు ఇచ్చి.. ధావన్కు షాక్ ఇచ్చారు. ఆసియా క్రీడలకు ఎంపిక కాకపోవడంపై తాజాగా ధావన్ స్పందించాడు.
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
భారత జట్టులో తన పేరు లేకపోవడంతో కాస్త షాక్కు గురయ్యానని శిఖర్ ధావన్ చెప్పాడు. ‘ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టులో నా పేరు లేకపోవడంతో కాస్త షాక్కు గురయ్యా. కానీ బీసీసీఐ సెలక్టర్లు భిన్నమైన ఆలోచనా విధానంతో ఆ నిర్ణయం తీసుకున్నారని అర్థం చేసుకున్నా. దానిని నేను అంగీకరించాలి. రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందరూ యువకులే. వారు బాగా రాణిస్తారని నాకు నమ్మకం ఉంది’ అని గబ్బర్ తెలిపాడు.
‘పునరాగమనం కోసం నేను సిద్ధంగా ఉంటా. అందుకే నన్ను నేను ఫిట్గా ఉంచుకుంటా. ఇప్పటికీ శిక్షణను, ఆటను ఆస్వాదిస్తున్నా బీసీసీఐ సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను. నా భవిష్యత్తు గురించి నేను ఏ సెలక్టర్తో మాట్లాడలేదు. నేను ఎన్సీఏకు వెళ్తున్నా. అక్కడ నా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. సౌకర్యాలు బాగున్నాయి. ఎన్సీఏ నా కెరీర్ని తీర్చిదిద్దింది. అందుకు నేను కృతజ్ఞుడను’ అని శిఖర్ ధావన్ చెప్పాడు.
తాజావార్తలు
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!