టీమిండియా చాంపియన్స్ తమ టీంను ప్రకటించింది. సిక్సర్ల కింగ్, 2007(T20), 2011(ODI) వరల్డ్కప్స్ విజేత యువరాజ్ సింగ్ ఈ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్, ఆర్పీ సింగ్ తదితరులు ఈ టీమ్ లో స్థానం దక్కించుకున్నారు. కాగా భారత్ తో పాటు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో ఆస్ట్రేలియా చాంపియన్స్, ఇంగ్లండ్ చాంపియన్స్, సౌతాఫ్రికా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఆడబోతున్నాయి.