2019 ఎన్నికల్లో ప్రారంభమైన వైసీపీ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అయితే టీడీపీ పరిస్థితి మాత్రం 2019 కంటే ఇంకా దయనీయంగా మారినట్లు కన్పిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట సైతం ఇప్పుడు ఆపార్టీ సత్తా చాటలేకపోవడం ఇందుకు నిదర్శంగా నిలుస్తుంది. టీడీపీకి కంచుకోటలుగా ఏరియాలు సైతం ఈ ఎన్నికల్లో బీటలువారినట్లు కన్పిస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ…
అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఇతర నేతలపై ఒంటికాలితో లేచే మంత్రి కొడాలి నాని.. మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, లోకేష్ను ఉద్దేశిస్తూ.. తుప్పు, పప్పు అంటూ ఫైర్ అయ్యారు.. పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు.. మరి.. టీడీపీ నుంచి గెలిచినవాళ్లంతా.. పార్టీ ఆదేశాలను ధిక్కరించినవాళ్లా? అని ప్రశ్నించారు.. సీఎం జగన్ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్న కొడాలి నాని.. పరిషత్ ఎన్నికల్లో…
అయ్యన్న పాత్రుడుది టెర్రరిస్ట్ మనస్తత్వం అని ఏపీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జగన్ వైఎస్ కుమారుడే కానీ వారసుడు కాదు.పేదల హృదయాలను గెలుచుకున్న వాడు సీఎం జగన్ అని చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. అయ్యన్న మాటలతో సమాజమే సిగ్గుతో తలదించుకుంది. బీసీ నాయకుడైన అయ్యన్న ఎస్సీ మహిళైన హోం మంత్రిని కించ పరిచారు. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలి అన్న ఆయన…
చంద్రబాబు కంచుకోట కుప్పం కోటలు బీటలు వారుతున్నాయా? మెజార్టీ తగ్గడం, పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు సంకేతాలా? టీడీపీ వెనకబాటు ఇప్పటి వరకేనా.. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటుందా? ఏం జరుగుతోంది కుప్పంలో…! కుప్పం బాబు కోటకు బీటలు వారుతున్నాయా?నాటి పంచాయతీ ఎన్నికల్లో 89లో టీడీపీకి దక్కింది 14..! కుప్పం… చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన ఏడుసార్లు వరసగా గెలుస్తున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లకుండానే గెలిచేస్తున్నారు చంద్రబాబు. అంటే… అక్కడ…
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. ఎంపీపీ అధ్యక్షుడిగా ఎవర్ని ఎన్నుకోవాలి అన్నా జనసేన సపోర్ట్ అవసరం కావడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీటీసీలకు ఆకర్షించేందుకు క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జనసేన పార్టీ ఎంపీటీసీలు కీలకం కావడంతో జనసేన ఆ పార్టీ ఎంపీటీసీలను రహస్యప్రాంతానికి తరలించింది. ఇటు టీడీపీ…
ఆంధ్రప్రదేశ్లో వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చితికిలపడిపోయింది.. ఇక, ఈ ఎన్నికలతో టీడీపీ పని అయిపోయిందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆక్రోశం, ఆందోళన మొదలైందని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందనన్నారు.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయింది.. టీడీపీకి ప్రజల్లో మనుగడ…
తిరుపతి : జగన్ కు సమానంగా లోకేష్ ను తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు పిచ్చి ఆలోచన అని… గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ చేసుకోవాలి..అదే మంచిదన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబు మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నానని… జగన్ చేసిన అభివృద్ధి వల్లే కుప్పంలో భారీ విజయం సాధించామని వెల్లడించారు. గత పాలకులు ఎన్నో ఏళ్లుగా స్థానిక పోరు జరపకుండా…
మంత్రిగా.. ఎంపీగా చేసిన ఆయన సడెన్గా పొలిటికల్ తెర నుంచి కనుమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నల్లపూసై చర్చగా మారారు. ఆయనది మౌనమా? వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏమా కథ? టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? నిమ్మల కిష్టప్ప. అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2019లో హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో..…
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దూసుకుపోతుంది. ఆ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్సీపీకి 17, టీడీపీకి 2 గెలిచాయి. అలాగే…. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. ఇక శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్సీపీ, 1 చోట టీడీపీ గెలుపొందాయి. మరో 6 చోట్ల ఫలితాలు…
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా కన్నెర్ర చేస్తే మీరు రోడ్డు మీద తిరగగలుగుతారా ? అచ్చెన్నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల్లోకి వెళదాం… మీ సీట్లు మీకు మిగులుతాయో లేదో చూసుకుందామని పేర్కొన్నారు. ఓటమి తప్పదని ముందే టీడీపీ పారిపోయిందని… ఎన్నికలు బహిష్కరిస్తామని డ్రామాలు చేసిందని విమర్శించారు.రెండేళ్ల జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి…