పాపం బాబు.. ఢిల్లీ యాత్రకు అపాయిమ్మెంట్ కూడా దొరకడం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ క్రమంగా మసకబారుతుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే బాబు గత కొంతకాలంగా రాజకీయంగా విఫలం అవుతున్నారు. ట్రెండ్ తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహాలు ఉండకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. 2020లోనూ పాతకాలం నాటి వ్యూహాలనే చంద్రబాబు నమ్ముకోవడంతో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఇమేజ్ ఏపీలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ డ్యామేజ్ అవుతుండటం శోచనీయంగా మారింది.
ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉండేది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల ముందు చంద్రబాబు అనుసరించిన వ్యూహం బెడిసి కొట్టింది. దీంతో అటూ ఏపీలో, ఇటూ ఢిల్లీలోనూ బాబు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. దీంతో రెంటింకి చెడ్డ రేవడిలా చంద్రబాబు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు బాబుకు ఢిల్లీ వెళితే చాలా మంది జాతీయ నేతలు ఆయనకు స్వాగతం పలికేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేకపోవడానికి చంద్రబాబు స్వయం కృతాపరాధమేననే తెలుస్తోంది.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
కొన్నేళ్లుగా చంద్రబాబు పూటకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆతర్వాత వాటిని గాలికొదిలేయడం లాంటివి చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు ఓడ మల్లమ్మ.. అవసరం తీరాక బోడ మల్లమ్మ అన్నట్లుగా ఆయన వ్యహరిస్తున్నారు. దీంతో ఆయనపై జాతీయ స్థాయి నాయకులకు సైతం నమ్మడం లేకుండా పోతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కట్టిన బాబు ఆ తర్వాత పత్తాకు లేకుండా పోవడం ఇందుకు నిదర్శంగా కన్పిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సైతం ఇటీవల కాలంలో చంద్రబాబును దూరంపెడుతూ వస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు ఏమి వెళ్లడం లేదు. ఇక బీజేపీ సైతం చంద్రబాబును నమ్మడం లేదు. ఇప్పటికే ఆయన బీజేపీని మూడుసార్లు ముంచారని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆయన్ని చేరదీయడం లేదు. అదేవిధంగా జాతీయ స్థాయి నేతలైన మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్లు సైతం బాబును దూరంగా పెడుతున్నారు.
కాగా ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. దీనిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో దీక్షలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులను వివరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయ్మింట్ చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుకు మునుపటిలా అపాయింట్మెంట్ దొరకడం లేదని టాక్. దీంతో ఒక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇచ్చే ఫిర్యాదులను హోమంత్రి స్వీకరించ వచ్చేమోగానీ ఆయన్ని తమతో కలుపుకుపోయే సీన్ లేదని మాత్రం స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!