చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో కి వచ్చినప్పుడు 14200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు అయ్యి 25 వేల కోట్లకు చేరిందని, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారని ఆయన అన్నారు.…
రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. శాసన సభ, మండలి, సెక్రటేరియట్ , AP హైకోర్టు ఇక్కడ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్వార్టర్లు కూడా నిర్మించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సీడ్ యాక్సెస్ రోడ్లను అభివృద్ధి చేశారు. వైఎస్సార్సీపీ టిక్కెట్పై ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం…
అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్షాలకు సర్వేపల్లి నియోజకవర్గం అగ్నిపరీక్ష కానుంది. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేరును టీడీపీ సీరియస్గా పరిశీలిస్తుండగా, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని మళ్లీ నామినేట్ చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ ఇస్తే మూడోసారి పోటీ చేస్తానన్నారు. కాకాణి తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 2014లో 5,446, 2019 ఎన్నికల్లో 13,973 మెజారిటీతో రెండుసార్లు గెలిచి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. 2022 ఏప్రిల్లో…
చంద్రబాబుపై ఎంపీ నందిగామ సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అన్నారు. అనరాని మాటలు అని ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లడుతున్నారని ఆరోపించారు. తాను పనిచేస్తేనే ఓటు వేయాలని జగన్ చెప్తుంటే.. 40 ఏళ్ల అనుభవం ఉండి పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీ వెంట పడుతున్నారని విమర్శించారు. 14 ఏళ్లలో ప్రజలకు చేసిన మంచి పని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి…
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు.. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు.
రాష్ట్ర పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కల్యాణ్ సిద్ధం అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెబుతారు.. ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు. కాగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడటం 98శాతం ఖాయమని అన్నారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే 30శాతం అధికంగా సీట్లు సాధిస్తాం అని ధీమావ్యక్తం చేశారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్యలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్ సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్ సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరిగాయి. 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.