ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏళ్లతరబడి రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
న్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు ఆయనను పూల వర్షాలతో ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జలదంకి మండలం కొత్తపాలెం, సోమవరప్పాడు, కృష్ణపాడు, బోయలపాడు, వేములపాడు, కోదండరామపురం పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్.. బుగ్గనకు దమ్ముంటే బేతంచర్లలో మెజార్టీ తెచ్చుకోవాలన్నారు.. బుగ్గన సొంత వార్డులోనే టీడీపీ జెండా ఎగురవేశాం.. కేఈ, కోట్ల కుటుంబాలు గూగుల్ లో కనపడకుండా చేస్తామన్నారు మంత్రి బుగ్గన అంటున్నారు.. గూగుల్ తల్లిని సృష్టించింది మేమే అన్నారు.
గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తెలుగుదేశం పార్టీ.. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వేరే ఎవరికి కేటాయించ వద్దని కోరుతూ.. అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ.. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా.. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. దీనిపై నేడు…
కూటమిగా ప్రజల్లోకి వెళ్లాల్సిన పార్టీల మధ్య కుంపట్ల రాజుకుంటున్నాయా..? పైకి కన్పించని అగాధమేదో లోలోపల పెరిగిపోతోందా? మోడీ పేరును వాడుకోవడం లేదని బీజేపీ ఫీలవుతుంటే…. ఆ వివాదాలు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని టీడీపీ, జనసేన భయపడుతున్నాయా? ముస్లిం రిజర్వేషన్స్ తుట్టెను కదిపితే… మొదటికే మోసం వస్తుందని గ్లాస్, సైకిల్ భయపడుతున్నాయా? పోలింగ్ ముంగిట్లో జరగబోతున్న పరిణామాలేంటి? లెట్స్ వాచ్. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య పైకి కనిపించనిది ఏదో జరుగుతోందా? అంటే అవును నిజమే కావచ్చన్నది…
కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ వచ్చినా…. టీడీపీకి గుర్తింపు ఉంటుందా? ఆ పార్టీ అనుకున్నట్టుగా పరిణామాలు ఉంటాయా? అసలు కేంద్ర సర్కార్లో టీడీపీ భాగస్వామి అవడానికి బీజేపీ ఒప్పుకుంటుందా? మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి? అసలు ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసే ఏపీలోఎన్నికలకు వెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏలో చేరిన టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో…