Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kakarla Suresh Is The Joint Mla Candidate Of Udayagiri Who Is Running In The Election Campaign

Kakarla Suresh: కాకర్లకు మద్ధతుగా నారా రోహిత్ ఎన్నికల ప్రచారం

Published Date :May 8, 2024 , 5:40 pm
By Rajesh Veeramalla
Kakarla Suresh: కాకర్లకు మద్ధతుగా నారా రోహిత్ ఎన్నికల ప్రచారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాకర్ల సురేష్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని తెలిపారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ అనే నేను పోటీ చేస్తున్నానని.. మా గుర్తు సైకిల్ అని సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. మరోవైపు.. దుత్తలూరు మండల కేంద్రంలో టీడీపీ తలపెట్టిన ర్యాలీ దద్దరిల్లింది. దుత్తలూరు గ్రామంలోని కృష్ణ మందిరం నుండి దుత్తలూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, మేకపాటి శాంత కుమారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బూరి వెంగళరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో మంచినీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థులను చూసి మీరు ఓటు వేయాలని ప్రార్థించారు. అమృత ఘడియలు ఆసన్నమయ్యాయని మంచి కాలం ముందుంది అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్ల సైకిల్ కి వేసి అత్యధిక మెజార్టీ అందించాలని ప్రార్థించారు.

మా నాన్నను గెలిపించండి ఉదయగిరి ప్రజలకు అండగా ఉంటాం- సంహేత్
టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేద ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు రూపొందించారని కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల సంహేత్ తెలిపారు. జలదంకి మండలంలోని చోడవరం గ్రామంలో మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ నాన్న కాకర్ల సురేష్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని కోరారు. మీరు వేసే ఓటు ఉదయగిరి నియోజక వర్గ అభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి సేవా భావం కలిగిన వ్యక్తి అని.. ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరోవైపు.. వింజమూరు టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆర్ఎంపీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకర్ల సురేష్ సోదరుడు.. కాకర్ల సునీల్ ఆర్ఎంపీ డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉదయగిరికి పట్టిన జబ్బు వదలాలంటే మీరందరూ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పాలకులు చేస్తున్న పనులు మీ అందరికీ తెలుసునని, చదువుకున్న మేధావులైన మీరు, పదిమందికి తెలిసేలాగా ప్రస్తుత పరిస్థితులను వివరించాలన్నారు. మరోవైపు.. కలిగిరి మండలంలోని సిద్దన కొండూరులో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటా తిరిగి పంపిణీ చేశారు. తెలుగు దేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. తన భర్త కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని.. ఇంటింటా తిరిగి మహిళలకు బొట్టు పెట్టి ప్రచారం నిర్వహించారు. ఉదయగిరి అభివృద్ధికి తమ సొంత నిధులతో గత రెండు సంవత్సరాలుగా పాటుపడుతున్నామని తెలిపారు.

Also Read

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
  • Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
  • AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..

పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమం
దుత్తలూరు మండల నాయకత్వంలో చేపట్టిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుండి పసుపు జెండాలతో కలసి వచ్చి మమత మమకారాల చేత మంగళహారతులచేత సోదర భావాల చేత ఆదరభిమానాలతో కాకర్ల సురేష్ కు స్వాగతం పలికారు. మంగళవారం దుత్తలూరు మండలంలో నిర్వహించిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే రౌడీ రాజ్యాన్ని సాగనంపి రైతు ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఉదయగిరి తలరాత మారాలి అంటే, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఉదయగిరిలో మార్పు జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని అందుకోసం మీ అందరి సహకారం కావాలని ప్రార్థించారు. ఉదయగిరి మెట్ట ప్రాంతంలో వెంటాడుతున్న ప్రధాన సమస్య మంచి నీటి సమస్య అన్నారు. తాను గెలిచిన వెంటనే మొదటి ప్రాధాన్యత మంచినీటి కొరత తీరుస్తానన్నారు. 50 గడపలు దాటిన ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వింజమూరు పట్టణంలో పురవీధుల్లో ఉదయగిరి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ మరియు కుటుంబ సభ్యులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెట్ట ప్రాంతం అయ్యిన ఉదయగిరి నియోజక వర్గంలో పరిశ్రమలు రావాలంటే కాకర్ల సురేష్ ను గెలిపించాలని కోరారు. అటు.. కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలోని కొత్తూరు గ్రామంలో కాకర్ల సురేష్ మాతృమూర్తి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ బిడ్డ మీ గడపకు వస్తున్నారని ఓటు వేసి ఆదరించాలని కోరారు. మీ బిడ్డకు మీరు వేసే ఓటుతో ఉదయగిరి నియోజక వర్గం అభివృద్ధికి బాటలు వేసిన వారు అవుతారని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Elections 2024
  • bjp
  • Election Campaign
  • janasena
  • joint MLA candidate

తాజావార్తలు

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..

  • Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం

  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!

  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ

  • Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions