YS Avinash Reddy: పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పేదల వైపు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల వైపు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి జగన్కు నష్టం చేయాలని చూస్తున్నాయని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదరికాన్ని తగ్గించడం కోసం పేదలకు అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరే పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తులు అని పేర్కొన్నారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఎవరూ పడొద్దని.. జగనన్న చొరవ వల్లే బద్వేల్ నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.
Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
Also Read
చంద్రబాబు దుర్బుద్ధి తేట తెల్లమైంది.. అవ్వ తాతలు, రైతులు, మహిళల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలన్నీ ఎన్నికల కోడ్కు ముందే అమలు చేసినవి అన్నారు. ఆసరా, విద్యా దీవెన, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని తెలిపారు. ఈ పథకాలకు నాలుగు నెలల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారని.. ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎన్నికల సంఘానికి అనుమతి కోరుతూ లేఖ రాశారన్నారు. ఆ నిధులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతోందని పేర్కొన్నారు. ఇది ఏ మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రాదని సూచించారు. సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది అని తెలిపారు. దీనిని కూడా చంద్రబాబు అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధుల గోడు చంద్రబాబుకు తగులుతుందని దుయ్యబట్టారు. పేదలకు నిధులు రాకుండా అడ్డుకోవడం కుట్రలో భాగమేనని అవినాష్ రెడ్డి తెలిపారు.
Ranveer Singh: షాకింగ్ : దీపికతో వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన రణవీర్ సింగ్?
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!