మడకశిర తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్పై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మడకశిర తహశీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు సస్పెండ్ చేశారని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్కు టూలెట్ బోర్డు ఖాయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అప్పులు, కేసులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని మండిపడ్డారు. విశ్వవ్యాప్తంగా తెలుగువారి పరువు తీసిన ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోకుండా తెదేపాపై నోరు పారేసుకోవడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగనుదేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని, స్విచ్ వేయకుండానే జగన్ ప్రజలను విద్యుత్ షాక్ లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని, ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుందని…
YCP MLA Kolusu Parthasarathy reacts on TDP Leader Atchannaidu Comments. టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న 30 లక్షల మంది మహిళకు ఇల్లు కట్టిస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రైతులకు కాదని ఆయన అన్నారు. తుఫాను పరిహారం సైతం ఎగ్గొట్టలేదా…? అని ఆయన ప్రశ్నించారు. ఏదన్నా ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తే…
YCP MLA Kolusu Parthasarathy countered on the remarks made by TDP leader Atchannaidu. ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైసీపీపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారని ఆయన ఆరోపించారు. వాళ్లు తాబేదార్లకు లాభం చేకూర్చేలా దోచుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత 90…