అసలే వారిద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది యవ్వారం. ఛాన్స్ దొరకగానే పరస్పరం మాటలతో విరుచుకు పడుతున్నారు. పార్టీ ఇంఛార్జ్ ఎదుటే అలా జరగడంతో అంతా బిత్తర పోయారట. నాకెందుకు చెప్పలేదని ఒకరు.. నీకెందుకు చెప్పాలని ఇంకొకరు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట. ఈ తాజా గొడవపైనే కాంగ్రెస్లో చర్చ. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఇద్దరూ కీలక నాయకులే.…
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ నేతల లెక్కలు వేరే ఉన్నాయా..? అందుకే తొందర పడుతున్నారా..? ఆరు నెలల ముందే అభ్యర్ధుల ప్రకటన నుంచి.. డిసెంబర్లోనే టికెట్ల ఫైనల్ అని చెబుతోందా? ఇంతకీ ఇది సాధ్యమయ్యే పనేనా..? సమయం లేదు మిత్రమా అని ఎవరు ఎవరిని అప్రమత్తం చేస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనపై తెలంగాణా కాంగ్రెస్ తొందర పడుతోందా? లేక వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తోందా? ఒకవైపు బీజేపీ.. ఇంకోవైపు అధికార టీఆర్ఎస్ ఆకర్షణ…
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయా..?కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటాయా..? వైఎస్ ఆశయాల కోసం కలిసి పనిచేస్తాయా..?రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుంటాయా..?టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమి వస్తుందా..? కొత్త కూటమి..! తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, షర్మిల పార్టీతో అవగాహన కుదుర్చుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తే.. టీఆర్ఎస్ కు గట్టి ఫైట్ ఇవ్వొచ్చనే ఆలోచన మొదలైంది. అవసరమైతే లెఫ్ట్…
ఆపరేషన్ వరంగల్. ఈ మధ్య కాలంలో ఓరుగల్లు రాజకీయాల్లో బలంగా చర్చల్లో ఉన్న మాట. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్ఎస్.. బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తులే పొలిటికల్ కలర్స్ను మార్చేస్తున్నాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ నాయకుల్లో కొందరు 12…
తెలంగాణ కాంగ్రెస్లో చేరికలతో ఊపు తెద్దాం అనేది స్ట్రాటజీ. అదే చేరికల అంశంలో సీఎల్పీ నేత భట్టి పంచాయితీ ముగిసిందో లేదో మరో కొత్త రగడ బయకొచ్చింది. గాంధీభవన్లో మాజీ మేయర్ ఎర్ర శేఖర్ చేరిక పూర్తి కాకముందే.. స్టార్ క్యంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎర్ర శేఖర్ చేరికను తప్పు పట్టారు. అధిష్ఠానానికి లేఖ రాయబోతున్నారు కూడా. నేర చరిత్ర ఉన్న వాళ్లను కాంగ్రెస్లో చేర్చుకోవడం ఏంటనే లొల్లి మొదలైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వెనక…
తెలంగాణ కాంగ్రెస్లో వివాదాలు కామన్. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డం అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం.. భిన్నాభిప్రాయాలు అనే డైలాగులు వినిపిస్తారు. అయితే తరచూ ఇలాంటి అంశాలు చర్చగా మారడంతో.. వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించారా అనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మధ్య సఖ్యత లేదని గుర్తించి.. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడారనే వాదన వినిపిస్తోంది. పార్టీలో ఇటీవల పెద్ద దుమారం రేగింది. పీసీసీ…
అలిగిరి ప్రవీణ్రెడ్డి. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ రెడ్డి .. 2014లో ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కండువా మార్చేశారు. గులాబీ గూటికి చేరుకున్నారు ప్రవీణ్రెడ్డి. అయితే రెండు దఫాలుగా హుస్నాబాద్లో టీఆర్ఎస్ నుంచి వొడితల సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. దీంతో అధికారపార్టీలో టికెట్ రాదనుకున్నారో లేక.. అక్కడ గుర్తింపు లేదని భావిస్తున్నారో కానీ.. కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట ప్రవీణ్రెడ్డి. రాష్ట్రంలో…
ఆరే ఆరు నెలలు. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు.. ఇతర నాయకులు నోళ్లు కట్టుకుని కూర్చున్నారు. తమ సహజ శైలికి భిన్నంగా మౌనం దాల్చారు. ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మళ్లీ పూర్వ పద్ధతిలోకి వచ్చేశారు. కాంగ్రెస్లో అంతే అనే రీతిలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. నేరుగా పీసీసీ చీఫ్కే గురిపెట్టేవారు కొందరైతే.. సీనియరైతే నాకేంటి అనేలా మరికొందరి వైఖరి ఉంది. ఇలాంటి సమస్యలు వస్తే గతంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్నవాళ్లు వెంటనే…