Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record What Mantra Was Given To Bhatti And Revanth Reddy In Delhi

TCongress : భట్టి, రేవంత్ రెడ్డిలకు ఢిల్లీలో ఏం మంత్రం వేశారు?

Published Date :July 8, 2022 , 12:13 pm
By Premchand Chowdary
TCongress : భట్టి, రేవంత్ రెడ్డిలకు ఢిల్లీలో ఏం మంత్రం వేశారు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు కామన్. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డం అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం.. భిన్నాభిప్రాయాలు అనే డైలాగులు వినిపిస్తారు. అయితే తరచూ ఇలాంటి అంశాలు చర్చగా మారడంతో.. వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించారా అనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క మధ్య సఖ్యత లేదని గుర్తించి.. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడారనే వాదన వినిపిస్తోంది.

పార్టీలో ఇటీవల పెద్ద దుమారం రేగింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లేపిన చిచ్చు ఏఐసీసీలో సెగలు రేపింది. చేరికలు కోసం వెళ్లిన రేవంత్‌ని ఉండమని చెప్పి.. హైదరాబాద్‌లో ఉన్న సీఎల్పీ నేత భట్టిని అధిష్ఠానం హుటాహుటిన ఢిల్లీ పిలిచింది. కాంగ్రెస్‌ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న కేసీ వేణుగోపాల్‌తో ఆ ఇద్దరూ భేటీ అయ్యారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీలో ప్రారంభమైన పంచాయతీ.. ఆ తర్వాత చేరికలపై చర్చ వరకు వెళ్లింది. ఈ రెండు అంశాల్లో కీలక నేతలు ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉందని గుర్తించింది పార్టీ. యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌ రాక సందర్భంగా ఇద్దరూ ఎవరికి వారు సమాచారం ఇచ్చాం అంటున్నారు. కానీ.. జగ్గారెడ్డి వంటి వారు తమకు సమాచారమే లేదని మీడియాకు ఎక్కారు. ఇక్కడే ట్విస్ట్ ఉందనేది కాంగ్రెస్‌ వర్గాల చర్చ.

తెలంగాణలో చేరికల్ని వేగవంతం చేయాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశిస్తోంది. దీంతో అధిష్ఠానం చెప్పంది కదా అని… చేర్చుకోవడం మొదలు పెట్టారు రేవంత్‌. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు చేరికపై సీఎల్పీ నేతకి సమాచారం ఇవ్వలేదట. దానిపైనే రచ్చ జరిగింది. ఆ తర్వత చేపట్టిన ఒకటి రెండు చేరికలపై కూడా ప్రశ్నలు వినిపించాయి. పీసీసీ చీఫ్‌ ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే విమర్శలు బయటకొచ్చాయి. దీనిపై పార్టీలోని సీనియర్లు ఏకమైన పరిస్థితి కనిపించింది.

ఆ గొడవలే.. యశ్వంత్ సిన్హా ప్రచారం కేంద్రంగా.. కాంగ్రెస్‌లో అలజడికి దారితీశాయి. ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని అనుకుందో ఏమో.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ భట్టిని ఢిల్లీకి పిలిచింది. రేవంత్‌, భట్టిల మధ్య ఉన్న గ్యాప్‌పై హస్తినలో చర్చ సాగినట్టు సమాచారం. కాంగ్రెస్‌లోకి ఎవరొచ్చినా చేర్చుకోవాలని సూచించారట. కాకపోతే.. పీసీసీ చీఫ్‌ దగ్గర ఉన్న చేరికల జాబితాను.. సిఎల్పీ నేత దగ్గరున్న లిస్ట్‌ను వేణుగోపాల్ తీసుకున్నారట. ఆ రెండు జాబితాల్లో ఏఐసీసీ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్లను చేర్చుకోవడానికి రేవంత్‌, భట్టి అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్‌ దూకుడికి బ్రేక్‌లు వేశామని.. ఆయనంటే గిట్టని కాంగ్రెస్‌ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. చెప్పా పెట్టకుండా చేస్తున్నారనే చర్చ నుంచి.. ఇప్పుడు అందరికీ చెప్పి చేయాలనే వరకు తీసుకొచ్చామని అనుకుంటున్నారట.

వాస్తవానికి టీఆర్ఎస్‌ నుంచి వచ్చే వారి వివరాలను ముందే లీక్ చేస్తే… చేరికలు ఆగిపోయే ప్రమాదం ఉందన్నది రేవంత్‌ టీమ్‌ వాదన. చేరికలు పార్టీ ఆదేశాల ప్రకారమే.. పార్టీ అనుమతితోనే నడుస్తున్నాయని చెబుతోంది. పైగా చేరికలు అనేవి వ్యూహంలో భాగమని.. వాటిని బయటకు చెబితే ఆ వ్యూహానికి అర్థమే ఉండబోదని వాదిస్తోంది. చేరికలపై ముందుగా సమాచారం ఉండాలన్న దానిపైనే కాంగ్రెస్‌లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కేసీ వేణుగోపాల్‌తో భేటీ తర్వాతైనా.. నాయకుల మధ్య సయోధ్య కుదురుతుందా..? ఢిల్లీకి వెళ్లిన వాళ్లు చేరికల స్పీడ్ పెంచుతారా..? అనే చర్చ జరుగుతోంది. మరి.. హైకమాండ్‌ ఎలాంటి మంత్రం వేసిందో.. ఆ మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jagga reddy
  • mallu bhatti vikramarka
  • revanth reddy
  • tcongress
  • Yashwant Sinha

తాజావార్తలు

  • Sri Rama Navami: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఇలా చేస్తే చాలు.!

  • BCCI Naman Awards: లెజెండ్స్‌కు బీసీసీఐ సలాం! రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌లకు అత్యున్నత పురస్కారాలు..

  • Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…

  • Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..

  • Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చి హైకోర్టు..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions